జైనథ్/ఆదిలాబాద్ రూరల్ : తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథతో ఇంటింటికి శుద్ధ జలం అందిస్తోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. బుధవారం మండలంలోని కూర, దత్తగూడ, సాత్నల గ్రామాల్లో తాగునీటి ట్యాంకుల నిర్మాణానికి స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 20వేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకులను రూ.12లక్షల వ్యయంతో నిర్మిస్తున్నామన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇప్పటికే 90శాతం నీరు అందిస్తున్నామని, మిగతవాటిని కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్ , టీఆర్ ఎస్ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్ రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఎస్.లింగారెడ్డి, డీఈ వెంకటరమణ, ఏఈ చంద్రశేఖర్ , సర్పంచులు అడ్డి లతావెంకట్ రెడ్డి, పేందుర్ మోహన్ , నాలు పట్టెపు, విలాస్, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో టీసీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బౌలింగ్ మెషిన్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..జిల్లాలోని క్రీడాకారులను ప్రోత్సహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. డీవైఎస్వో వెంకేటేశ్వర్లు, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.