నిర్మల్ అర్బన్, ఏప్రిల్ 20 : ట్రాన్స్జెండర్ల సేవలు అభినందనీయమని నిర్మల్ పట్టణ సీఐ మల్లేశ్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్లో ట్రాన్స్జెండర్ సిరి బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాన్స్జెండర్లు ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం సమాజంలో మంచి మార్పునకు శ్రీకారం అని అన్నారు. ప్రజలు వారిని చులకన, హేలన భావంతో చూడవద్దని, వారు కూడా సమాజ అభివృద్ధిలో భాగస్వాములేనని పేర్కొన్నారు. వీరి సేవలు సమాజానికి ఎంతో అవసరమని, ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని సామాజజిక సేవలకు ముందుకు రావాలని పారు. ట్రాన్స్జెండర్లందరికీ ఆదర్శంగా నిలిచేలా సేవా కార్యక్రమాలు చేపట్టిన సిరి, వారి బృందాన్ని సీఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్లు స్వర్ణ ప్రియ, సమీరా, మనీష, ఆర్తి తదితరులు పాల్గొన్నారు.