ఇంద్రవెల్లి/ఉట్నూర్, ఫిబ్రవరి 2 : ప్రాజెక్టులు నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ పునర్నిర్మాణ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉట్నూర్ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ.38.20 కోట్లతో చేపడుతున్న రోడ్లు, భవనాలు, అమరవీరుల స్మృతివనం పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావ్, కొండా సురేఖ, శాసన మండలి సభ్యులు వెంకటేశ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జుపటేల్తో కలి సి సీఎం శంకుస్థాపన చేశారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అనుమతితో కుఫ్టి, సదర్మాట్ ప్రాజెక్టులను నిర్మిస్తామని, కడెం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయిస్తామన్నారు. ఆ నాడు ఇంద్రవెల్లిలో ప్రతిజ్ఞ చేశామని, ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలను ప్రా రంభించుకున్నామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఆదివాసీల ప్రాం తాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలన్నా రు.
ఐటీడీఏ ద్వారా గిరిజన ఆవాసాలకు రూ. 27 కోట్లతో రహదారులు, వంతెనలు, రూ. 5 కోట్లతో నేరడిగోండ మండలం బుగ్గారాంలో గిరిజన బాలికల గురుకుల పాఠశాల భవనం, అమరవీరుల స్తూపం వద్ద రూ.కోటితో స్మృతివనం నిర్మిస్తామన్నారు. ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో రూ. 60 కోట్లతో నీటి శుద్ధి కేంద్రం పనులు చేపడుతున్నామన్నారు. అమరవీరుల 15 కుటుంబాలకు ముత్నూర్లో ఇంటి స్థలం, ఇండ్లు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు.
మహిళలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే త మ ధ్యేయమని సీఎం అన్నారు. నాగోబా ద ర్బార్ హాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలతో సీఎం ముఖాముఖి నిర్వహించా రు. అనంతరం గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 1450 డ్వాక్రా సంఘాలకు సుమారు రూ.60 కోట్ల రుణాలు బ్యాంక్ లింకేజీ కింద పంపిణీ చేశారు. త్వరలో గ్యాస్ సిలిండర్లను త్వరలోనే రూ.500కే అందిస్తామని, 200ల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. కెస్లాపూర్ నాగోబా ఆలయం లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.7 కో ట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నాగోబా ఆలయంలో ప్రత్యేక పూ జలు చేశారు. స్టాళ్లను పరిశీలించారు. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి, కలెక్టర్ రాహుల్రా జ్, ఎస్పీ గౌస్అలం, ఐటీడీఏ ఇన్చార్జి పీవో ఖుష్బుగుప్తా, అధికారులు పాల్గొన్నారు.