కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీలో గురువారం ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ ( Shivaji Maharaj ) జయంతి వేడుకలు ( Jayanti celebration ) నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా యువ నాయకుడు గుర్రం భాను ప్రసాద్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ నిజమైన హిందూ నాయకుడని, హిందూ ధర్మ రక్షణ కోసం, స్వరాజ్య స్థాపన కోసం జీవితాన్ని అంకితం చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ యువ నాయకులు గుర్రం భాను ప్రసాద్, బచ్చల హర్షిత్, తిప్పారపు బన్నీ, కాపురపు సన్నీ, ఉమ్మడి సందీప్, బండారు వినయ్, సాయి, బన్నీ, పంభాల సన్నీ, శేఖర్, తాటికర్ల హరీష్, వెంకటేష్, కాపురాలు బన్నీ తదితరులు పాల్గొన్నారు.