ఇంద్రవెల్లి, డిసెంబర్ 23 : జనవరి 1వ తేదీన నిర్వహించే శౌర్య దివస్ వేడుకలను విజయవంతం చేయాలని మహర్ బెటాలియాన్ జిల్లా అధ్యక్షుడు వాగ్మారే శైలేందర్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలోని మైదానంలో సభస్థలాన్ని శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలోని పుణే పట్టణంలో భీమా నది ఒడ్డున 1818 సంవత్సరం జనవరి1న ఆత్మగౌరవం కోసం ప్రాణాలను పణంగా పెట్టి పేశ్వా బాజీరావ్తో పోరాడి అమరులైన మహర్ వీరుల విజయగాథను స్మరించుకోవడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లాలోని నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ భీం ఆర్మీ అధ్యక్షుడు పరత్వాగ్ దత్త, అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండలాధ్యక్షుడు సర్కాళే శివాజీ, భీం ఆర్మీ మండలాధ్యక్షుడు సూర్యవంశీ ఉత్తమ్, బహుజన సంఘం నాయకులు దిలీప్, నాగరాజ్, కిరణ్, జితేందర్, రాజేందర్, విజయ్, రజినీకాంత్ పాల్గొన్నారు.
పోస్టర్ విడుదల
ఎదులాపురం, డిసెంబర్ 23 : జనవరి 1వ తేదీన కైలాస్నగర్లో నిర్వహించే శౌర్య దివస్ కరపత్రాలను శుక్రవారం డీసీసీబీ కార్యాలయంలో ఎమ్మెల్యే జోగు రామన్నవిడుదల చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, శైలేందర్, సాయబ్రావ్, దయానంద్ కాంబ్లే, దాదా సాహెబ్, తదితరులు పాల్గొన్నారు.