నార్నూర్ : సీసీ కెమెరాల ( CCTV ) ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చని ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీరామ్ జాదవ్ ( Sriram Jadav ) అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు ఆయన సీసీ కెమెరాలను అందించి శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాలను అరికట్టేందుకు దాతలు ముందుకు వచ్చి సీసీ కెమెరాలను అందించాలని సూచించారు. ప్రజల భద్రత కోసం ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజమ్మ, ఎస్సై శ్రీ సాయి, మాజీ చైర్మన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, బీఆర్ఎస్ నాయకులు ఉర్వేత రూప్ దేవ్, రాథోడ్ సుభాష్, సయ్యద్ ఖాసిం,సూల్తాన్ ఖాన్ ఉన్నారు.