ఎదులాపురం, జనవరి 20 : ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న కేసుల్లో ఇరువురికి న్యాయం జరిగేలా పరిష్కరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. ఆదిలాబాద్లోని కోర్టు ప్రాంగణంలో శుక్రవారం వివిధ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ రాజీపడే కేసులు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. పోలీసులు, బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ ప్రతినిధులు, న్యాయవాదుల సహకారంతోనే లోక్ అదాలత్ విజయవంతం అవుతుందన్నారు. ఫిబ్రవరి 11వ తేదీన నిర్వహించే లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సతీశ్ కుమార్, డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమాదేశ్పాండే, న్యాయమూర్తులు మంజుల, యశ్వంత్ సింగ్ చౌహాన్, పీపీలు, తదితరులు పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కోర్టు ప్రాంగణంలోని కార్యాలయంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడాపోటీలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత ప్రారంభించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు మంజుల, యశ్వంత్సింగ్ చౌహాన్, డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమాదేశ్పాండే, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్, ప్రధాన కార్యదర్శి చందు సింగ్, స్పొర్ట్స్ కార్యదర్శి ఉమేశ్ డోలే, తదితరులు పాల్గొన్నారు.