చెన్నూర్ టౌన్, ఫిబ్ర వరి 18 : చెన్నూర్కు చెందిన బీఆర్ఎస్ నే తలపై పోలీసులు కేసులు న మోదు చేశారు. చెన్నూర్ ని యోజకవర్గం క్యాతనపల్లిలో ఎన్నికల విధుల్లో ఉన్న తమపై దాడిచేసి విధులకు ఆటంకం కలిగించారని దేవాపూర్ ఎస్ఐ గంగారాం మంగళవారం రాత్రి రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంత్రి వివేక్, పెద్దపల్లి ఎంపీ వంశీ ఓటు వేసేందు కు వెళ్తున్న సమయంలో రాళ్లతో కొట్టడంతో కోటపల్లి ఎస్ఐ రాజ శేఖర్ చేతివేళ్లకు, కానిస్టేబుల్ రాకేశ్ తలకు గాయమైందని ఫిర్యాదు లో పేర్కొన్నారు.
ఈ మేరకు జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరె డ్డి, మాజీ కౌన్సిలర్ దోమకొండ అనిల్పై పలు సెక్షన్ల కింద కేసు న మోదు చేశారు. బుధవారం ఉదయం చెన్నూర్లోని అనిల్ ఇంటికి పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం జడ్పీ మా జీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డిని అరెస్ట్ చేశారు. మంచిర్యాలలోని ప్రభుత్వ దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించారు. బాల్క సుమన్తో పాటు మూల రాజిరెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్కు విధించినట్లు, ఆదిలాబాద్ జైలుకు తరలించనున్నట్లు సమాచారం.