కుభీర్ : మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వరాలయంలో మంగళవారం నిర్వహించే హిందూ సమ్మేళనం ( Hindu Sammelanam) కార్యక్రమానికి కుటుంబ సమేతంగా వేలాదిగా తరలిరావాలని సంఘాల నాయకుల పిలుపునిచ్చారు.
సోమవారం విట్టలేశ్వర మందిరంలో జరిగిన కార్యక్రమంలో సమ్మేళన నిర్వాహక కమిటీ అధ్యక్షులు చిమ్మన్ అరవింద్, మున్నూరు కాపు, యాదవ, ఆర్యవైశ్య కుల సంఘాలతో పాటు 18 కుల సంఘాల నాయకులు మాట్లాడారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమలానంద భారతి స్వామి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ సమ్మేళనంలో గోమాత పూజ అనంతరం సామూహిక కుంకుమార్చన, హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు స్వామివారి ప్రసంగం ఉంటుందని వివరించారు.
మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా బొమ్మిడి మల్లేష్, ఏశాల దత్తాత్రి, పడిపెల్లి గంగాధర్, రోహిత్ ధర్మసేన, లింగన్న, బోయిడి అభిషేక్, గోనె విట్టల్, కుల సంఘాల ప్రతినిధులు, నిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.