ఆసిఫాబాద్ టౌన్, ఏప్రిల్ 20 : జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ ఆలయంలో ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు ప్రత్యేక పూజలు చేశారు. బీ-ఫామ్ తీసుకున్న తర్వాత మొదటిసారి జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన ఆలయానికి చేరుకొని మొక్కుకున్నారు. అర్చకులు శిరీష్ శర్మ, శ్రీనివాసరావు ఆయనకు ఆశీర్వాదం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకుడు జాలీంషా, సకు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ నెల 23న నిర్వహించే హనుమాన్ జయంతి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను కమిటీ సభ్యులతో కలిసి బీఆర్ఎస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సకు ఆవిషరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు పిన్న వివేక్, గుండా వెంకన్న, రాధాకృష్ణాచారి, ఎకరాల శ్రీనివాస్, డాక్టర్ మధు, ప్రదీప్, సురేందర్ పాల్గొన్నారు.