బజార్హత్నూర్, నవంబర్ 22 : బోథ్ నియోజకవర్గంలో మరింత అభివృద్ధి కోసం తనను ఆశీర్వదించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ అన్నారు. బుధవారం మండలంలోని పిప్పిరి, వర్తమన్నూర్, గిర్నూర్ గ్రామాల్లో మాజీ ఎంపీ నగేశ్తో కలిసి గడపగడపకూ వెళ్లి ప్రచారం చేశారు. అంతకుముందు గ్రామాల్లోకి విచ్చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్, మాజీ ఎంపీ నగేశ్కు ప్రజలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని, అది సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేయడంతోనే సాధ్యమైందని అన్నారు.
పిప్పిరి గ్రామంలోని బీడీ కార్మికులతో ముచ్చటిస్తూ కేసీఆర్ అందిస్తున్న బీడీ పింఛన్ ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తానని, 200 పింఛన్ రెండు వేలకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ది అని రాబోయే రోజుల్లో ఐదు వేలకు పెంచడం ఖాయమని వివరించారు. ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, రైతులు, ప్రజలకు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
-మాజీ ఎంపీ నగేశ్
ప్రజలు ఆగం కావద్దు తప్పుడు మాటలు నమ్మి మోసం చేసే వారిని ఎన్నుకోవద్దు.. మళ్లీ ఒక్కసారి పొరపాటు చేస్తే ఐదేండ్ల పాటు గొసపడాల్సి వస్తదని మాజీ ఎంపీ నగేశ్ అన్నారు. గ్రామాల్లోకి కాంగ్రెస్, బీజేపీ నాయకులు వచ్చి జూటేబాతు మాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని అలాంటి వారిని నమ్మిపోసపోవద్దు. సీఎం కేసీఆర్ పాలనలో గడపగడపకూ సంక్షేమ ఫలాలు అందాయి. మళ్లీ కేసీఆర్ సర్కారే వస్తుంది. ప్రజలు ఆగం కాకుండా బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్లు నారమ్మ, కృష్ణ, పాక్స్ చైర్మన్ మేకల వెంకన్న, ఎంపీటీసీలు మురళి, ఈశ్వర్, యువజన సంఘం అధ్యక్షుడు డుబ్బుల చంద్రశేఖర్, నాయకులు కానిందె ఉద్దోవ్, చిల్కూరి భూమయ్య, నానం రమణ, అల్కె గణేశ్, బొడ్డు భోజన్న, మడిగే రమేశ్, నారడి మల్లేశ్, తాండ్ర శ్రీనివాస్, మడిగే రమణ, సకేశ్, భగత్ వినోద్, లక్ష్మణ్, జనార్దన్, భోజన్న, తదితరులు పాల్గొన్నారు.
సొనాల, నవంబర్ 22 : తొమ్మిదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిచాలని ఎన్నికల ఇన్చార్జి మాజీ ఎంపీ నగేశ్, బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ కోరారు. బుధవారం సొనాలలో ఎంపీపీ తుల శ్రీనివాస్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కదం ప్రశాంత్, బోథ్ సర్పంచ్ సురేందర్ యాదవ్, సొనాల సర్పంచ్ సదానందం, బోథ్ కన్వీనర్ నారాయణ రెడ్డితో కలిసి ప్రచారం చేశారు. ప్రచారానికి వచ్చిన మాజీ ఎంపీ నగేశ్, జాదవ్ అనిల్కు మహిళలు మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు.
ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరెంట్ లేక పంటలు ఎండిపోయేవని, తెలంగాణ వచ్చాకే పంటలకు 24 గంటల ఉచిత కరెంట్ కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్నదని, కల్యాణ లక్ష్మి, రైతుబందు, రైతుబీమా, కేసీఆర్ కిట్ వంటి పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ రుక్మాణ్ సింగ్, బీఆర్ఎస్ బోథ్ పట్టణ అధ్యక్షుడు అల్లకొండ ప్రశాంత్, ఎంపీటీసీలు జమున-రాజేశ్వర్, సునీత-రోహిదాస్, గులాబ్సింగ్, గౌతమ్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్, ఈశ్వర్, నరేందర్, జుగదిరావ్, అభిలాష్, హరీశ్, సుధీర్ రెడ్డి, సుగుణాకర్, అమృత్ రావ్, భీం రావ్ పాటిల్, శ్రీకాంత్, గణేశ్, షాదుల్లా, రాజు, కన్నా, సంతోష్, దినేశ్, శరత్, మహముద్, కార్యకర్తలు పాల్గొన్నారు.