తాంసి(తలమడుగు), డిసెంబర్ 2 : బోథ్ నియోజకవర్గంలో ధర్మమే గెలుస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ విశ్వాసం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పేదల పక్షపాతి అయిన సీఎం కేసీఆర్కు మద్దతిచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాట్లాడారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా డబ్బు, మద్యంతో ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్నిఎత్తులు వేసిన వాటిని ప్రజలు పటాపంచలు చేశారన్నారు. బోథ్ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినట్టు తెలిపారు.
నిస్వార్థంగా తాను చేసిన సేవకు గుర్తింపుగా ఓటర్లు ఓటు వేశారని పూర్తి నమ్మకం తనకు ఉందని ఆయన స్పష్టం చేశారు. తన గెలుపు కోసం రెండు నెలలుగా ప్రచారంలో పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. వారి వెంట బీఆర్ఎస్ మాజీ రాష్ట్ర కార్యదర్శి చింతలపెల్లి దేవారెడ్డి, రవికాంత్ యాదవ్, బోథ్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మొట్టె కిరణ్కుమార్, సర్పంచ్ స్వప్న రత్నప్రకాశ్, ఉప సర్పంచ్ ప్రశాంత్, దేవీదాస్, తిరుపతి, మున్న, రాజు, చందు, అక్షయ్, నిమ్మల సుదర్శన్ రెడ్డి, గంగాధర్, గోక ప్రకాశ్ రెడ్డి, బాదుర్ నర్సింహులు, జువ్వాక నర్సింహులు పాల్గొన్నారు.