తాంసి (తలమడుగు), డిసెంబర్ 7 : బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. గురువారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను నేరడిగొండలో రుయ్యాడి రెడ్డి సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. కార్యక్రమంలో రుయ్యాడి రెడ్డి సంఘం అధ్యక్షులు నిమ్మల సుదర్శన్ రెడ్డి, యువ నాయకులు చిన గోక ప్రకాష్ రెడ్డి, బీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు నిట్టెడి గంగాధర్, మాజీ ఎంపీటీసీ బాదూర్ నర్సింలు, బీఆర్ఎస్ బీసీ సెల్ మండలాధ్యక్షులు కాల్వ మల్లేశ్ పాల్గొన్నారు.
తాంసి, డిసెంబర్ 7 : మండలంలోని బీఆర్ఎస్ నాయకులు గురువారం నేరడిగొండలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను కలిసి, మిఠాయిలు తినిపించి శాలువాలతో సన్మానించారు. ఇక్కడ ప్యాక్స్ వైస్ చైర్మన్ ధనుంజయ్, గ్రామ పటేల్ గంగారాం, మాధవ్ ఉత్తం పాల్గొన్నారు.
నేరడిగొండ, డిసెంబర్ 7 : బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ను కలవడానికి నాయకులు, అభిమానులు, అధికారులు భారీగా తరలివచ్చారు. మండల కేంద్రంలోని ఆయన నివాసంలో కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చాలు, మొక్కలను అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఇచ్చోడ, డిసెంబర్ 7 : బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను నేరడిగొండలోని ఆయన నివాసంలో ఇచ్చోడ, సిరికొండ మండలాల నాయకులు కలిసి సత్కరించారు. మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎంపీపీ ప్రీతంరెడ్డి, ఎంపీటీసీ సుభాష్, ఉప సర్పంచ్ గణేశ్, శ్యాంరావ్, అశోక్ పాల్గొన్నారు.
బోథ్, డిసెంబర్ 7: బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ను చింతల్బోరి ఎంపీటీసీ జాదవ్ సునీత, జాదవ్ రోహిదాస్ నేరడిగొండలోని ఎమ్మెల్యే నివాసంలో కలిసి సత్కరించారు. అలాగే పద్మశాలీ సంఘం నాయకులు కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మండలాధ్యక్షుడు ఆసాల సదాశివ్, గ్రామాధ్యక్షుడు సామల సంతోష్, నారాయణ, రాజేశ్వర్, ఎర్రన్న పాల్గొన్నారు.
సొనాల, డిసెంబర్ 7: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ని బీఆర్ఎస్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సొనాల సర్పంచ్ సదానందం, చింతల్బోరి ఎంపీటీసీ సునీత-రోహిదాస్, నాయకులు నారాయణ, నరేందర్, ఈశ్వర్, సంతోష్, గణేశ్, రాము, విజయ్, కిరణ్, గుర్జాల్ సింగ్, ప్రదీప్, కృష్ణ, ఇందల్ సింగ్, గాంధీ ఉన్నారు.
బజార్హత్నూర్, డిసెంబర్ 7: ఎమ్మెల్యే జాదవ్ అనిల్ ను నేరడింగొండలో మండల బీఆర్ఎస్ నాయకులు, నెట్ క్యాంపు మాజీ డైరెక్టర్ చిల్కూరి భూమయ్య కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ నాయకులు భగత్ వినోద్, నరేందర్, ప్రేందాస్, వినోద్ పాల్గొన్నారు.
భీంపూర్, డిసెంబర్7: అంతర్గాం సర్పంచ్ బక్కి లలిత కుమారుడు, బీఆర్ఎస్ కార్యకర్త కపిల్యాదవ్ దీక్షను విరమించారు. అనిల్జాదవ్ గెలుపొందిన తరువాత తాను గ్రామానికి చెందిన ఐదుగురు పేదలను పుణ్యక్షేత్రం తీసుకెళ్తానని , గెలుపు వరకు పాదరక్షలు ధరించనని మొక్కుకున్నాడు. ఈ మేరకు పాదరక్షలు ధరించకుండానే గ్రామాలో ప్రచారం చేశాడు. గురువారం అనిల్జాదవ్ను కలిసిన తరువాత కపిల్ పాదరక్షలు వేసుకున్నాడు. అలాగే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటానని చెప్పారు.