ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొని బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో 14 మందికి గాయాలయ్యాయి. ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్ శివారులో ఈ ఘటన జరిగింది. నాగ్పూర్ నుంచి వాహనం హైదరాబాద్కు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించినట్లు తెలిసింది. క్షతగాత్రులంతా ఛత్తీస్గఢ్కు చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.