నేడు మంచిర్యాల జిల్లాలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన
తెలంగాణ యువకెరటం.. భావి తెలంగాణ రథసారధి.. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖల మాత్యులు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) నేడు(ఆదివారం) మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో రూ.312.96 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. వీటితోపాటు రూ.500 కోట్ల ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కూడా భూమిపూజ చేస్తారు. కాగా.. మందమర్రిలో భారీ రోడ్ షో, రామకృష్ణాపూర్లో ప్రగతి నివేదన పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించనుండగా ఎంపీ వెంకటేశ్ నేతకానితో కలిసి ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఏర్పాట్లను పరిశీలించారు. కేటీఆర్ రాక సందర్భంగా కార్మిక క్షేత్రం గులాబీమయంగా మారింది. రోడ్లు, వీధులు గులాబీ జెండాలతో రెపరెపలాడుతున్నాయి. భారీ ఎత్తున కేసీఆర్, కేటీఆర్, సుమన్ కటౌట్లను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించే రోడ్ షోకు ఒక్కో వార్డుకు 500 చొప్పున, భారీ బహిరంగ సభకు 25 వేల మందిని తరలించాలని నాయకులు, కార్యకర్తలకు విప్ సుమన్ దిశానిర్దేశం చేశారు.
– మంచిర్యాల, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) నేడు(ఆదివారం) మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలోని మందమర్రి, రామకృష్ణాపూర్ మున్సిపాలిటీల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలోవిప్ బాల్క సుమన్ మాట్లాడారు. రెండు మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్, ఇరిగేషన్ తదితర డిపార్ట్మెంట్లకు సంబంధించి రూ.312.96 కోట్ల అభివృద్ధి పనులు, కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన, ప్రారంభోత్సవా లు చేస్తారన్నారు. వీటితోపాటు జూన్ 9న సీఎం కేసీఆర్ శిలాఫలకం ఆవిష్కరించిన రూ.500 కోట్ల ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమిపూజ చేస్తారని చెప్పారు. ఉద యం 9.30 గంటలకు పర్యటన మొదలై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతోందన్నారు.
భీమారం మండల పరిధిలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.14.53 కోట్లతో నిర్మించే రోడ్లు, బ్రిడ్జిలు, చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో రూ.20.40 కోట్లతో నిర్మించే పది రోడ్ల పనులను మంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. అలాగే రూ.11.70 కోట్లతో పాలవాగుపై పులిమడుగు,అందుగులపేట, సండ్రూన్పల్లి దగ్గర మూడు చోట్ల బ్రిడ్జిలు, చెన్నూ ర్ పక్కన అక్కెపెల్లి వాగుపై బ్రిడ్జి కమ్ చెక్ డ్యామ్ల నిర్మా ణ పనులను మంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. రూ.500 కోట్లతో మందమర్రి మండలం, శంకరపల్లిలో పామాయిల్ ఫ్యాక్టరీకి భూమిపూజ చేసిన అనంతరం మందమర్రి మున్సిపాలిటీలో రూ.204.8 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉం టాయన్నారు. అనంతరం మందమర్రి మార్కెట్ చౌరస్తా లో రోడ్ షో ఉంటుందని తెలిపారు.
ముందు సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో సభ పెడుదామనుకున్నా, అక్కడ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఉండడంతో కార్యక్రమాన్ని మందమర్రి మార్కెట్ చౌరస్తాకు మార్చినట్లు తెలిపారు. అక్కడ రోడ్ షో అనంతరం మంత్రి కేటీఆర్ ప్రసంగం ఉం టుందన్నారు. అక్కడి నుంచి క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ.50కోట్లతో గాంధారి వనం సమీపంలో 250 ఎకరాల్లో నిర్మించే కేసీఆర్ అర్బన్ పార్క్ పనులకు భూమి పూజ చేస్తారన్నారు. రూ.20కోట్లతో మొదటి విడుత పను లు ప్రారంభిస్తారన్నారు. ఎక్కడా లేని విధంగా ఒక అద్భుతంగా ఈ కేసీఆర్ అర్బన్ పార్క్ ఉంటుందన్నారు. మొ త్తంగా ఈ మున్సిపాలిటీలో రూ.108.16 కోట్ల పనులు ప్రారంభం, శంకుస్థాపన చేస్తామన్నారు. అనంతరం రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతారని చెప్పారు. జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధి యజ్ఞాన్ని ఇలాగే కొనసాగించాలి..
గతంలో విస్మరణకు గురైన ప్రాంతం, వెనుకబడేయపడిన ప్రాంతం, గత పాలకులు, ప్రభుత్వాలు, పార్టీల హయాంలో నిర్లక్ష్యానికి గురైనది తూర్పు ఆదిలాబాద్ ప్రాంతం అని బాల్క సుమన్ అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో మంత్రుల సహకారంతో మా ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యేలు దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, ఆసిఫాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు కోనప్ప, సక్కు, జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అందరం కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా సాగుతున్నామన్నారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి యజ్ఞం ఇలాగే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. దాచిదాచి దయ్యాల పాలు చేసినట్లు, ఈనగాచి నక్కల పాలు చేయొద్దన్నారు. అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే ఈ ప్రాంతాన్ని తిరిగి బీఆర్ఎస్ చేతిలో పెట్టాలన్నారు. మీ అందరి ఆశీర్వాదం బీఆర్ఎస్ పార్టీకి, స్థానిక శాసన సభ్యులుగా మా అందరికి ఉండాలన్నారు. కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే దివాకర్రావు, జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ పాల్గొన్నారు.