ముథోల్, మార్చి 4: ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి దేవాదాయశాఖ రూ.24 లక్షలు మంజూరు చేయగా, శనివారం భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఉన్న ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక నిధులు మంజూరు చేస్తున్నట్లు గుర్తు చేశారు. ఇప్పటికే చాలా వరకు ఆలయాలు పూర్తయ్యాయని వెల్లడించారు. ఆలయ నిర్మాణానికి స్థలాన్ని విరాళంగా ఇచ్చిన యువకులు శ్రీనివాస్, బోజేందర్ను అభినందించారు. విరాళ దాతలను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. అనంతరం ఉపాధిహామీ కింద మంజూరైన సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు లావణ్య, రవీందర్రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మెన్ సురేంధర్ రెడ్డి, ఎంపీటీసీ గంగాధర్, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు రవి, సర్పంచ్ సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే
బాసర, మార్చి 4 : మండల కేంద్రంలోని కౌఠ జడ్పీఎస్ఎస్ను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సందర్శించారు. పాఠశాలలో చేపడుతున్న పనులను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులను భోజనం గురించి అడిగి తె లుసుకున్నారు. అనంతరం విద్యాబోధన గు రించి మాట్లాడారు. ఆయన వెంట ఎంపీటీసీ భోజరాం పటేల్, బాసర సర్పంచ్ లక్ష్మణ్ రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోవింద రాజులు, మల్కన్న యాదవ్ పాల్గొన్నారు.
స్వరాష్ట్రంలోనే దేవాలయాల అభివృద్ధి
భైంసా, మార్చి, 4: స్వరాష్ట్రంలోనే దేవాలయాల అభివృద్ధి జరుగుతుందని ముథోల్ ఎమ్మె ల్యే విఠల్ రెడ్డి అన్నారు. కుంటాల మండలంలోని అందకూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయాల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కుంటాలతో పాటు ఓలా, లింబా (కే) గ్రామా ల్లో గ్రామదేవతల నిర్మాణానికి నిధులు మం జూరు చేశామన్నారు. ముందుగా ఆయన విగ్రహాల ప్రతిష్ఠాపన చేసిన ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గం గామణి బుచ్చన్న, సర్పంచ్ దాసరి కిషన్, ఎంపీటీసీ దాసరి మధు, బీఆర్ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, సోషల్ మీడియా వర్కింగ్ ప్రెసిడెంట్ దశరథ్, స్థానిక నాయకులు సాగర్ రావు, నర్సింగ్ రావు, మాజీ ఎంపీటీసీ కన్నం లక్ష్మణ్ రావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం భైంసా నుంచి సికింద్రాబాద్కు సూపర్ లగ్జరీ బస్సును ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. ఆయన వెంట డీఎం అమృత, ఏఎంఎఫ్ వెంకటేశ్వర్లు, ఏడీసీ హైమద్ హుస్సేన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.