కుభీర్, మార్చి 28 : స్వరాష్ట్రంలోనే పద్మశాలీలకు గౌరవం దక్కిందని, వారిని అన్ని రంగాల్లో ముందుంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తున్నారని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని రంజని గ్రామంలో దేవాదాయశాఖ నిధులు రూ.35 లక్షలతో చేపట్టిన మార్కండేయ ఆలయ నిర్మాణం, రూ.2 కోట్లతో జాంగాం నుంచి రంజని తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం ఆయన భూమిపూజ చేశారు. పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మశాలీ కులస్తులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పద్మశాలీలు గతంలో ముంబై, భీవండి లాంటి పట్టణాలకు వ లసలు వెళ్లేవారని, ఇప్పుడు కేసీఆర్ కల్పిస్తున్న సంక్షేమ పథకాలతో వలసలు తగ్గాయన్నారు. రా జకీయాల్లోనూ ప్రాధాన్యమిచ్చి ఎల్ రమణను ఎ మ్మెల్సీగా సీఎం కేసీఆర్, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్గా చిలుక రమణను రాష్ట్రమంత్రి ఐకే రెడ్డి నియమించి పద్మశాలీలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు.
వచ్చే ఏఎంసీ పాలకవర్గంలో పద్మశాలీ కు లస్తులకు స్థానం కల్పించనున్నట్లు సభాముఖంగా హామీ ఇచ్చారు. చేనేత కార్మికులకు పింఛన్, వడ్డీలేని రుణాలు, బీమా సౌకర్యం లాంటి పథకాలతో వారిలో ధైర్యాన్ని నింపిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆదరించాలని కోరారు. ముందుగా ఆయన మార్కండేయ చిత్రపటానికి పూజలు చేశారు. రాష్ట్ర, జిల్లా పద్మశాలీ నాయకులతో భూమిపూజ చేయించారు. అనంతరం సంఘం సభ్యులు ఎమ్మెల్యే విఠల్రెడ్డిని శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రంగారావు జాదవ్, ఎంపీటీసీ పంతుల హన్మాండ్లు, మార్క్ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్, వైస్ ఎంపీపీ మోహియొద్దీన్, పీఏసీఎస్ చైర్మన్ రేకుల గంగాచరణ్, వైస్ చైర్మన్ రమేశ్, బాసర, మార్లగొండ ఎంపీటీసీలు గంటల శ్యాంసుందర్, శ్యాంరావు, బీఆర్ఎస్ జిల్లా ప్ర ధాన కార్యదర్శి తూము రాజేశ్వర్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, బీఆర్ఎస్ నాయకులు గోనే కళ్యాణ్, హైమద్, దొంతుల రాములు, సాహెబ్రావు, దాసరి మల్లారెడ్డి, పంతుల దేవేందర్, పద్మశాలీ సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు పెద్దరాముల్వార్ గంగాధర్, శాటల్వార్ అనిల్ కుమార్, ఎస్ మహేందర్, భూషణ్, అంగర్వార్ చిన్నన్న, జిడ్డేవార్ లింబయ్య, పండరినాథ్ మహారాజ్, వీడీసీ అధ్యక్షుడు దన్గరి బాలాజీ, రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షుడు జల్ద రమణ, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం, నాపా అధ్యక్షుడు చిప్ప ప్రభాకర్, బాసర సత్రం చైర్మన్ రాపోలు సుధాకర్, సంఘం జిల్లా అధ్యక్షుడు చిలుక రమణ, గౌరవ అధ్యక్షుడు పుట్ట కాశీరాం, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, సంఘం నాయకులు అల్లం అశోక్, కొక్కుల గంగాధర్, సాదుల కృష్ణదాస్, చాట్ల మహేశ్, చాట్ల గాయత్రి, జిడ్డు గంగరాజు, బోసి సంఘం అధ్యక్షుడు చిన్నన్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
నిధులు మంజూరు
లోకేశ్వరం మండలంలోని జోహర్పూర్ గ్రామంలో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.2.50 లక్షల మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి దేగాంలోని తన నివాసంలో మంగళవారం సంఘం సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నారాయణ రెడ్డి, ఎంపీటీసీ ఇందిరా గంగాధర్, కమిటీ సభ్యులు గజ్జన్న, సాయన్న, చిన్నన్న తదితరులు పాల్గొన్నారు.