తాంసి, జూన్ 12 : రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని గిరిగావ్ గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం నూతన గోదాం నిర్మాణానికి డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేను శాలువా, పూలమాలతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. గిరిగాం గ్రామానికి ఆద్భుతమైన రోడ్డు వేసుకున్నామని తెలిపారు. రైతులకు రైతుబంధుతో పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. నూతనంగా రూ.20 లక్షలతో గోదాం నిర్మించుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సురకుంటి మంజుల-శ్రీధర్ రెడ్డి, సర్పంచ్లు స్వప్న-రత్నప్రకాశ్, చౌదరి గజానన్, పీఏసీఎస్ సీఈవో కేశవ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ధనుంజయ్, ఉప సర్పంచ్ ఆత్రం ఇంద్రసేన్, మండల నాయకులు నాగిరెడ్డి, గోవర్ధన్, శ్రీనివాస్, వాడ్గూరే ఉత్తం, ఠాకూర్ గంగారాం, తులసీరాం పాల్గొన్నారు.
గోదాం నిర్మాణానికి భూమి పూజ
భీంపూర్, జూన్ 12 : మండలంలోని అర్లి(టీ) గ్రామంలో రూ.20 లక్షలతో మంజూరైన పీఏసీఎస్ గోదాం నిర్మాణం కోసం సోమవారం బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, సర్పంచ్ గొల్లి రమాబాయి, పీఏసీఎస్ డైరెక్టర్లు ధనంజయ్, ఏనుగు అశోక్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ రహూఫ్, నాయకులు లస్మన్న, వైభవ్, సంజీవ్ రెడ్డి, జీ నరేందర్ యాదవ్, ఉల్లాస్, కల్చాప్ యాదవ్, కపిల్ పాల్గొన్నారు.