కుభీర్, డిసెంబర్ 8 : రాష్ట్రంలో పురాతన ఆలయాల పునర్నిర్మాణంతో పాటు నూతన ఆలయాల నిర్మాణాలు, కల్యాణ మండపాల నిర్మాణాలు చేపడుతూ ప్రభుత్వం ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని కుప్టి గ్రామంలో శ్రీకృష్ణ ఆలయానికి ఆనుకొని రూ.12లక్షల ఎండోమెంట్ నిధులతో చేపడుతున్న కల్యాణమండపం నిర్మాణానికి ఆయన గురువారం భూమిపూజ చేశారు. అక్కడి నుంచి సొనారి గ్రామంలో పునర్నిర్మించిన దత్తసాయి ఆలయంలో విగ్రహాల పునఃప్రతిష్ఠ, కలశ స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రముఖ వేద పండితులు భభ్రు మహారాజ్, గణేశ్ మహారాజ్ ఆయనకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి అందరి తరపున కృతజ్ఞతలు తెలిపారు. గడిచిన ఏడున్నరేళ్లలో ఎన్నో ఆలయాలు పునర్నిర్మింపబడ్డాయన్నారు. కొత్తగా ఎన్నో ఆలయాలు రూపుదిద్దుకున్నాయని పేర్కొన్నారు. సొనారి ఆలయానికి ఎండోమెంట్ నిధులు రూ.10 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాలేగాంవ్, హంపోలి సర్పంచులు నర్సారెడ్డి, మహిపాల్రెడ్డి, మార్క్ఫెడ్ డైరెక్టర్ రేకుల గంగాచరణ్, ఏఎంసీ చైర్మన్ కందుర్ సంతోష్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు మోరే దత్తహరి పటేల్, నాయకులు తూం రాజేశ్వర్, శంకర్ చౌహాన్, మల్లారెడ్డి, కడారి విఠల్, గంగారావు, గోరేకర్ బాబు, బండి సుభాష్, రమేశ్, దేశెట్టి సాయన్న పాల్గొన్నారు.
భైంసా టౌన్, డిసెంబర్ 8 : మండలంలోని వాటోలి గ్రామంలో శివాలయం నిర్మాణానికి ఎమ్మెల్యే విఠల్రెడ్డి భూమి పూజ చేశారు. ఈ ఆలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ నుంచి రూ. 24 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. టీఆర్ఎస్ హయాంలో ప్రతి గ్రామానికి నూతన ఆలయాలు మంజూరు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకుడు సచిన్ పటేల్ తదితరులున్నారు.
కుభీర్ మండలంలోని బాకోట్ గ్రామానికి చెందిన స్వాతి జాతీయ స్థాయి నీట్ పరీక్షలో ఉత్తమ ర్యాంకు సాధించింది. నాగర్కర్నూల్లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సంపాదించింది. దీంతో గురువారం దేగాంలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆమెను శాలువాతో సన్మానించి అభినందించారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆయన వెంట లింగా సర్పంచ్ దుప్పె గణేశ్, నాయకులు రాజేందర్, పండిత్, సూర్యకాంత్ రెడ్డి తదితరులున్నారు.