భైంసాటౌన్, మార్చి 19: గ్రామాభివృద్ధికి యువత తోడ్పడాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. మండలంలోని ఖత్గాం గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న హనుమాన్ ఆలయానికి ఆదివారం భూ మి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప నులను గ్రామస్తులకు యువకులే అవగాహన క ల్పించాలన్నారు. సంస్కృతీ సంప్రదాయాలను మరువకుం డా భక్తి మార్గంలో పయనించాలని సూచించారు. త్వరలోనే బీటీ రోడ్లు, కల్యాణ మండపం నిర్మాణానికి కృషి చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమం లో భాగంగా గ్రామంలోని యువకులను ఆయన సన్మానించారు. అనంతరం వారు ఎమ్మెల్యేను సత్కరించారు. గ్రామంలో ఆలయానికి యువకులతో ఎమ్మెల్యే భూమి పూజ చేయించారు. స ర్పంచ్ రాజు, ఎంపీటీసీ మాణిక్, లింగా సర్పంచ్ దుప్పె గణేశ్, పోతన్న, మారుతి, వైస్ ఎంపీపీ గంగాధర్, గణేశ్ పాటిల్ పాల్గొన్నారు.
బుద్ధుడు చూపిన మార్గం అనుసరణీయం
బుద్ధుడు చూపిన మా ర్గం అందరికీ అనుసరణీయమని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. మండలంలోని వడ్గావ్ గ్రామం లో 10వ భౌద్ధ ధర్మపరిషత్ కార్యక్రమంలో ఆ దివారం ఆయన పాల్గొన్నారు. గ్రామంలోని అం బేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేను శాలువా, పూల మాలతో ఘనంగా సన్మానించారు. సర్పంచ్ సం తోష్పటేల్, ఆత్మ చైర్మన్ కానుగంటి పోతారెడ్డి, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, కో ఆప్షన్ సభ్యు డు గోవింద్రావ్పటేల్, బీఆర్ఎస్ నాయకులు భీంపవార్ వీరేశ్, మాజీ సర్పంచ్ ఆత్మరాం, దళిత నాయకులు సాయినాథ్, దిలీప్, దత్తు ఉన్నారు.