ఆదిలాబాద్ టౌన్, జనవరి 4 : బోధనోపకరణాలతో అర్థవంతమైన బోధన చేయవచ్చని ఆదిలాబాద్ డీఈవో ప్రణీత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా బుధవారం ఏర్పాటు చేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎం) మేళాను ఆమె సందర్శించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేళాలో ఆదిలాబాద్ అర్బన్, రూరల్, మావల మండలాలకు సంబంధించిన ఆయా పా ఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టీఎల్ఎం తో విద్యార్థులకు సరళమైన పద్ధతిలో పాఠాలు చెప్పవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గండ్రత్ రమేశ్, జిల్లా సెక్టోరియల్ అధికారి కంటే నర్సయ్య, ఎంఈవో జయశీల పాల్గొన్నారు.
కొలాం ఆశ్రమోన్నత పాఠశాలలో..
పట్టణంలోని కొలాం ఆశ్రమోన్నత పాఠశాలలో డివిజన్ స్థాయి సైన్స్ వైజ్ఞానిక మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఈవో ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనల గురించి అడిగి తెలుసుకుని వారిని అభినందించారు. కొత్తకొత్త ఆవిష్కరణలు చేస్తూ భవిష్యత్లో శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏటీడబ్ల్యూ నిహారిక, ప్రిన్సిపాల్ నారాయణరావు, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, సైన్స్ అధికారి రఘు రమణ పాల్గొన్నారు.
సైన్స్ఫెయిర్తో నైపుణ్యం వెలికితీత.. : పీవో
బజార్హత్నూర్, జనవరి 4 : విద్యార్థుల్లో దాగి ఉన్న వ్యక్తిగత నైపుణ్యన్ని వెలికితీసేదుకు సైన్స్ ఫెయిర్ దోహదపడుతుదని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. మండలంలోని జాతర్ల మోడల్ స్పోర్ట్స్కూల్లో బోథ్ డివిజన్స్థాయిలో 16 గిరిజన ఆశ్రమ పాఠశాలలకు చెందిన 80 మంది విద్యార్థులు 5 విభాగాల్లో సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ నైపుణ్యాలను పరిశీలించి, వారితో ముచ్చటించారు. ఈ కార్యాక్రమంలో ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్, డీడీటీడబ్ల్యూఎం దిలీప్కుమార్, ఏటీఈవో సౌజన్య, ఎంపీపీ జయశ్రీ, జడ్పీటీసీ మల్లెపూల నర్సయ్య, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.