బెల్లంపల్లి, జనవరి 13: బెల్లంపల్లి మార్కెట్, బజార్ ఏరియాలో సంక్రాంత్రి సందడి నెలకొన్నది. నోముల సామగ్రి, పతంగులు, దారం, చరఖాలు, వివిధ రకాల పూలు, రేగుపండ్లను, ముగ్గులకు కావాల్సిన రంగుల కోసం వచ్చిన వారితో మార్కెట్ సందడిగా మారింది. నోములకు వినియోగించే చక్కెర చిలుకలు, దారాలు, స్వీట్లు, ఇతర పూజా సామగ్రి అమ్మకాలు జోరుగా సాగాయి.
సంక్రాంత్రి సందర్భంగా వివిధ రకాల రంగుల అమ్మకాలు ఊపందుకున్నాయి. రంగులను కొనుగోలు చేసి ఇంటి మందు ముగ్గులు వేసేందుకు మహిళలు పోటీ పడి ముస్తాబు చేశారు. పిల్లల నుంచి పెద్దల వరకు పతంగులను ఎగురవేయడానికి వివిధ రకాల పతంగులను కొనుగోలు చేశారు. బస్తీలో చిన్నారుల నుంచి మొదలు పెద్దల వరకు పతంగు
వేమనపల్లి, జనవరి 13 : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మండలంలోని అన్ని గ్రామాల్లో మహిళలు ఇండ్లలో పిండి వంటలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. సంక్రాంతి పండుగకు చకినాలు, గారెలు, కార పూసలు, బూరెలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
దీంతో ఇండ్లలో మహిళలు పిండి వంటలు చేస్తూ గడుపుతున్నారు. సంక్రాంతి సెలవులు ఉండడంతో ఇతర పట్టణాల్లో నివాసం ఉంటున్న వారు మండలానికి చేరుకున్నారు. పిండి వంటలు తయారు చేసే పిండి కోసం గిర్నీల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. శనివారం ఏ ఇల్లు చూసినా మహిళలు పిండి వంటలు చేస్తూ కనిపించారు. గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొన్నది.