తాండూర్, ఏప్రిల్ 23 : కార్యకర్తలే మాకు కొండంత బలమని, ప్రజలే మా బలగమని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని సురభి మినీ గార్డెన్స్లో నిర్వహించిన 15 గ్రామాల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ దండె విఠల్, జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్, మాజీ ఎమ్మెల్యే ఓదెలుతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పార్టీ మండల అధ్యక్షుడు సుబ్బ దత్తుమూర్తి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమ్మేళనంలో సీఎం పంపిన సందేశాన్ని నారదాసు లక్ష్మణ్రావు చదివి వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేస్తుంటే.. గిట్టని ప్రతిపక్షాలు బీఆర్ఎస్పై, ముఖ్యమంత్రిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. మన రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాలవంటివి బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని ఎదుర్కొనే ధైర్యంలేక ఆయన కుటుంబ సభ్యులపై దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, బీఆర్ఎస్ బలం ముందు ఏ కుట్రలూ సాగవని స్పష్టం చేశారు. సిలిండర్ ధరలపై ప్రశ్నించినందుకేనా ఈ కుట్రలు అని మండిపడ్డారు. కుట్రలు.. కుతంత్రాలతో రాష్ట్రంలో అడుగు పెట్టాలని బీజేపీ యత్నిస్తోందని, ప్రజలంతా ఏకమై ఎదురించాలని కోరారు.
పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి : ఎమ్మెల్యే చిన్నయ్య
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. మహిళల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తున్నామన్నారు. కొందరు తమ కార్యకర్తల బలాన్ని తట్టుకోలేక సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. మా కార్యకర్తలు తలుచుకుంటే ఎంతటి వారినైనా సరే ఎన్నికల్లో మట్టి కరిపిస్తారని, ముచ్చటగా మూడోసారి తనను 50 వేల మెజార్టీతో గెలిపిస్తారన్నారు. గత ప్రభుత్వాలు తాండూరు మండలాన్ని పట్టించుకోలేదని, బీఆర్ఎస్ సర్కారు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నదని చెప్పుకొచ్చారు. తొమ్మిదేళ్లలో ప్రతి గ్రామానికీ రవాణా సౌకర్యం కల్పించిన ఘనత తమదేనని చెప్పారు. ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆత్మ స్థయిర్యంతో బతుకాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని చెప్పారు. జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలను ఇంటింటికీ తెలియజేయాల్సిన అవసరముందని తెలిపారు. దుర్గం చిన్నయ్య గెలుపుకోసం ప్రతీ కార్యకర్త సైనికుడిలా పని చేయాల్సిన అవసరముందన్నారు. మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్ మాట్లాడుతూ దేశ ప్రగతి కోసం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టారని, రాబోయే రోజుల్లో మతోన్మాద బీజేపీని బొంద పెట్టక తప్పదన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో, కేటీఆర్ సారథ్యంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించిన శిలాఫలకాలను బీజేపీ వారు లేక్క పెట్టాలంటే యేడాది పడుతుందన్నారు. కాంగ్రెస్, మత పిచ్చిగాళ్లతో ఒరిగేదేమీ లేదని తెలిపారు. చిన్నయ్య హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బోయపల్లి, కాసిపేట, మాదారం త్రీ ఇైంక్లెన్ గ్రామాల నుంచి సుమా రు 100 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. వీరిలో బోయపల్లి మాజీ సర్పంచ్ మిట్ట వేణుగోపాల్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పూసాల ప్రణయ్కుమార్, జడ్పీటీసీ సాలిగామ బానయ్య, వైస్ ఎం పీపీ దాగాం నారాయణ, తాండూర్ సర్పంచ్ పూదరి నవీన్కుమార్, బీఆర్ఎస్ మండల మహిళా అధ్యక్షురాలు దాగాం శంకరమ్మ, రైతు బంధు సమితి అధ్యక్షుడు మహోర్కర్ దత్తాత్రేయరావు, సర్పంచ్లు ధరావత్ సాగరిక, చింతపురి దుర్గుబాయి, చీమల శంకర్, ఎంపీటీసీలు సిరంగి శంకర్, మొగిలి శంకర్, మండల కో ఆప్షన్ సభ్యుడు రహ్మత్ఖాన్, ఏఎంసీ డైరెక్టర్లు గట్టు సంతోష్కుమార్, పెద్దబోయిన శంకర్, నాయకులు పురుషోత్తంగౌడ్, మంగపతి సురేశ్బాబు, మద్దికుంట రాంచందర్, ఎల్క రంచందంర్, పెర్క రాజన్న, మంగీలాల్, గౌస్, జావీద్, రవూఫ్, శివకృష్ణ, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి బోడ సతీష్, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు గణపతి అంజి, తాండూర్ టౌన్ అధ్యక్షుడు ముస్కె సాగర్ పాల్గొన్నారు.