ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : జిల్లా అభివృద్ధిలో బ్యాంకర్లు భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ రాల్రాజ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో అన్ని బ్యాంకుల ఆధ్వర్యంలో నిర్వహించిన రుణ వితరణ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ వరుణ్రెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధి చెందాలంటే ఆర్థికంగా ప్రజలు అభివృద్ధి చెందాలని దీనికి బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని సూచించారు. పంట రుణాల విషయంలో బ్యాంకర్లకు ఇచ్చిన లక్ష్యాన్ని నెరవేర్చలేదన్నారు. భవిష్యత్లో బ్యాంకర్లు తమ విధానాలను మార్చుకోవాలని సూచించారు. జిల్లాలో రుణం తీసుకున్న వారు తిరిగి చెల్లించడంలో ఎటువంటి ఇబ్బందులకు గురి చేసినా తాము బ్యాంకర్లకు అండగా ఉంటామని వెల్లడించారు.
జిల్లాలో గిరిజనుల సంఖ్య ఎక్కువగా ఉన్నారని వారికి వివధ రకాల రుణాలు అందించి ఆర్థికంగా ఎదిగేలా సహకరించాలని పేర్కొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ వరున్ రెడ్డి మాట్లాడుతూ పంటపొలల్లో బొర్వెల్ వేయడానికి రుణాల కోసం బ్యాంకులకు వస్తే తిరస్కరించవద్దని తెలిపారు. జిల్లాలో వెయ్యి లీటర్ల సామర్థ్యంతో ఆసిఫాబాద్ , వాంకిడి , రెబ్బెన, కాగజ్నగర్లో పాల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వీటి కోసం హైబ్రిడ్ గేదెల కొనుగోళ్లకు రుణాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంకు మేనేజర్ కోవ హన్మంత్రావు, ఎస్బీఐ నిజామాబాద్ డీజీఎం కుమార్, శ్రీనివాస్, అజయ్కుమార్ తదితరులు ఉన్నారు.