బెల్లంపల్లిరూరల్, జనవరి 20 : డిసెంబర్ 24న నిర్వహించిన అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ(బెంగళూర్) ప్రవేశపరీక్షలో బెల్లంపల్లి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీ (సీవోఈ)కి చెందిన ఆరుగురు విద్యార్థులు పుల్లూరి దీపక్, నగమళ్ల గణేశ్, గొల్ల బలరాముడు, గడపల సుమేద్, బత్తుల మధు, బండారి శివమూర్తి ప్రతిభ చూపి అర్హత సాధించారు. అంతర్జాతీయ, జాతీయస్థాయిలో వివిధ దేశాలు, రాష్ర్టాల్లోని కళాశాలల నుంచి యూనివర్సిటీ అడ్మిషన్ కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఉంటుంది. రాతపరీక్షతో పాటు ఆన్లైన్లో మౌఖిక పరీక్ష నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.
ఇంతటి పోటీ ఉన్న ఈ ప్రవేశపరీక్షలో మొదటి దశలో ప్రతిభ చూపి ఆన్లైన్ ఇంటర్వ్యూకి ఆరుగురు విద్యార్థులు అర్హత సాధించడంపై ప్రిన్సిపాల్ ఐనాల సైదులు ఆనందం వ్యక్తం చేశారు. సంక్షేమ గురుకులాల కార్యదర్శి డాక్టర్ నవీన్ నికోలస్ ఫోన్లో విద్యార్థులను అభినందించారు. శనివారం కళాశాలలో ప్రిన్సిపాల్ ఐనాల సైదులు అధ్యాపకులతో కలిసి ఆరుగురు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రాజ్కుమార్, జేవీపీ కోక్కుల రాజేశ్వర్, హయ్యర్ ఎడ్యుకేషన్ సెల్ కో ఆర్డినేటర్ ఆవునూరి రవి, అకాడమిక్ కో ఆర్డినేటర్ నాగిని శ్రీరామవర్మ, అధ్యాపకులు కిరణ్,అనిరుధ్, చందా లక్ష్మీనారాయణ, ఆకినేపల్లి రాజేశ్, రఫీ, మిట్ట రమేశ్, శాతరాజు తిరుపతి, రాకేశ్, సమేందర్, తేజశ్వి పాల్గొన్నారు.