ఎదులాపురం, ఫిబ్రవరి 2 : గంజాయి వంటి మాదకద్రవ్యాలను నిర్మూలించేందుకు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆదిలాబాద్ ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని తానిషాగార్డెన్లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం గంజాయి నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాలను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. అమాయక రైతులకు డబ్బు ఆశచూపి గంజాయి సాగుకు ప్రయత్నిస్తున్న వారిపై పోలీసుల నిఘా ఉందని వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు అందరి సహకారం పోలీసులకు అందించాలని సూచించారు. అనంతరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ రవీందర్ మాట్లాడుతూ అధ్యాపకులు, ప్రధానోపాధ్యాయులు తమ కళాశాలలో ఉండే విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసకాకముందే వారికి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డిపార్టెంట్ ఆఫ్ సైకాలజీస్ట్ డాక్టర్ ఓం ప్రకాశ్, రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, మున్సిపల్ కమిషనర్ శైలజ, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు పట్టణ డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐలు రామకృష్ణ, పురుషోత్తమాచారి, ట్రాఫిక్ సీఐ ఫణింధర్, ఎస్బీ సీఐ కృష్ణమూర్తి, మావల ఎస్ఐ సాయన్న, రూరల్ ఎస్ఐ హరిబాబు, ఎస్బీఎస్ఐ అన్వర్ ఉల్ హక్, సిబ్బంది పాల్గొన్నారు.