తాండూర్ : పురిటి నొప్పులతో పడుతున్న మహిళకు ఆటో యూనియన్ సభ్యుడు ఎంవీకే త్రీ ఇంక్లైన్ గ్రామానికి చెందిన అభిరాం అనే ఆటో డ్రైవర్ రక్తదానం ( Blood Donation ) చేసి మానవత్వం (Humanity) చాటుకున్నాడు. సోమవారం ఎంవీకే త్రీ ఇంక్లైన్ మన్నెగూడకు చెందిన ఒక నిండు గర్భిణీని తన ఆటోలో ఆసుపత్రికి తరలించారు.
పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు ఆపరేషన్ చేయాలని, అందుకు రక్తం అవసరముందని వైద్యులు కుటుంబ సభ్యులకు సూచించారు. అప్పటికప్పుడు రక్తం కోసం ఆందోళన చెందుతున్న తరుణంలో ఆటో డ్రైవర్ అభిరాం వారికి ధైర్యమందిస్తూ తాను రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు. అనంతరం వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించిన అనంతరం రక్తదానం చేశారు.
సకాలంలో స్పందించి గర్భిణిని ఆదుకున్న ఆటో డ్రైవర్ను తాండూర్ మండల ఆటో యూనియన్ అధ్యక్షుడు, మంచిర్యాల జిల్లా బీఆర్టీయూ అధ్యక్షుడు ఎండీ హబీబ్ పాషా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.