తెలంగాణ మూడో అసెంబ్లీ శనివారం కొలువుదీరింది. ఉదయం 11 గంటలకు ప్రొటెం స్వీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొదటగా సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ప్రమాణం చేయగా.. ఆ తర్వాత ఎమ్మెల్యేలు చేశారు.
ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బోథ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్, ఖానాపూర్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, ప్రేంసాగర్రావు, వినోద్, వివేక్, వెడ్మ బొజ్జు ఉన్నారు. శాసనసభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తూ సభ మర్యాదను, సంప్రదాయాలను పాటిస్తామని దైవ సాక్షిగా ప్రమాణం చేశారు.