జైనూర్, సెప్టెంబర్ 29: మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో గురువారం నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ చీరలు పంపిణీ చేస్తున్నారని కొనియాడారు. అనంతరం బతుకమ్మ పాటలపై కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మితో కలిసి ట్రైనీ ఐఏఎస్ అధికారులు చిందులేశారు. మూడు రోజులుగా జంగాం గ్రామంలో అధికారులు పర్యటిస్తున్నారు. ఆదివాసుల జీవన స్థితి గతులపై అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా జైనూర్లో జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మితో కలిసి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులను జడ్పీ చైర్పర్సన్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవ్రావు, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ఇంతియాజ్లాలా, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ అబుతాలిబ్, ఎంపీపీ కుమ్ర తిరుమల, వైస్ ఎంపీపీ చిర్లె లక్ష్మణ్, సహకార సంఘం చైర్మన్ కొడప హన్నుపటేల్, మండల కో ఆప్షన్ సభ్యుడు ఫెరోజ్ఖాన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సెడ్మకి సీతారాం, ఎంపీడీవో ప్రభుదయ, ఏపీఎం సుజాత, సర్పంచులు పార్వతి లక్ష్మణ్, మడావి భీంరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆత్రం శంకర్, గెడాం లక్ష్మణ్, నాయకులు షేక్ అబ్బు తదితరులున్నారు.
సద్దుల బతుకమ్మకు ఏర్పాట్ల పరిశీలన
సీసీసీ నస్పూర్, సెప్టెంబర్ 29: సద్దుల బతుకమ్మ నిమజ్జనం కోసం చేస్తున్న 11వ వార్డు పరిధిలో గల తోళ్లవాగు వద్ద ఏర్పాట్లను కౌన్సిలర్ జబీన్హైమద్తో కలిసి మున్సిపల్ కమిషనర్ టీ రమేశ్ గురువారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వంగ తిరుపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గర్శె భీమయ్య, పట్టణ యూత్ కార్యదర్శి కాటం రాజు, సంయుక్త కార్యదర్శి మహ్మద్ సాజిద్, వెంకటసాయి, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.