రెబ్బెన, అక్టోబర్ 14 : తెలంగాణ రాష్ట్ర సర్కారు, సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆసిపాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. దళిత బంధు పథకంలో మంజూరైన చిత్ర ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ను రెబ్బెన మండల కేంద్రంలో శుక్రవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంరతం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని దళితులందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ దళితబంధు ప్రవేశపెట్టి రూ.10 లక్షలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, జడ్పీటీసీ వేముర్ల సంతోష్, పీఏసీఎస్ చైర్మన్ కార్నాథం సంజీవ్కుమార్, వైస్ చైర్మన్ రంగు మహేశ్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోటు శ్రీధర్రెడ్డి, కో ఆప్షన్మెంబర్ జౌరొద్దీన్, సర్పంచులు బొమ్మినేని అహల్యాదేవి, చెన్న సోమశేఖర్, బుర్స పోశమల్లు, ఎంపీటీసీలు పెసరి మధునయ్య, రాము, ఉపసర్పంచ్ మడ్డి శ్రీనివాసగౌడ్, రైతుబంధు సమితి జిల్లా సభ్యురాలు కుందారపు శంకరమ్మ, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు మోడెం సుదర్శన్గౌడ్, ఆలయ చైర్మన్ వోల్వోజి వెంకటేశంచారి, టీఆర్ఎస్ మహిళా మండలాధ్యక్షురాలు అన్నపూర్ణ అరుణ, టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు జుమ్మిడి ఆనందరావు, బొమ్మినేని శ్రీధర్, మోడెం చిరంజీవిగౌడ్, పల్లె రాజేశ్వర్రావు, గుంపుల విమలేశ్, దోమల వెంకన్న, దుర్గం రాజేశ్, అన్నపూర్ణ మురళీగౌడ్, మన్నెం పద్మ తదితరులు పాల్గొన్నారు.
మార్లవాయి గ్రామ అభివృద్ధికి సహకరించండి
ఆసిఫాబాద్ టౌన్, అక్టోబర్ 14 : రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గ్రామంగా ఎన్నికైన జైనూర్ మండలంలోని మార్లవాయి గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేసి సహకరించాలని కోరుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు, సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేశ్వర్ రావ్ స్థానిక ఎమ్మెల్యే సక్కుతో కలిసి కలెక్టర్ రాహుల్ రాజ్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసినా గద్దె పూర్తిగా దెబ్బతినడంతో అది కిందపడిపోయే ప్రమాదం ఉందని వాపోయారు. త్వరితగతిన మరమ్మతులు చేయించి గ్రామస్తుల కష్టాలు తీర్చాలని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కనక బొద్దు దేవయ్య, తదితరులు పాల్గొన్నారు.