జైనూర్, జనవరి 8 : రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని రాంనగర్లో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మండలంలో జరిగే అభివృద్ధి పనులకు కార్యకర్తలు, నాయకులు సహకరించాలని కోరారు. అనంతరం తొడసం సీతారాం స్మారక క్రికెట్ పోటీలను ప్రారంభించారు.
జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కొడప హన్నూ పటేల్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు మడావి భీంరావ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఇంతియాజ్ లాలా, జైనూర్ సర్పంచ్ మెస్రం పార్వతి-లక్ష్మణ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు కుమ్ర భగవంత్రావ్, మోహన్, కెరమెరి జడ్పీటీసీ, లింగాపూర్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆత్రం అనిల్ తదితరులున్నారు.