మంచిర్యాలటౌన్, ఫిబ్రవరి 15: మంచిర్యాల గోదావరి తీరంలో ఈనెల 21 నుంచి 24వరకు జరిగే సమ్మక్క, సారలమ్మ జాతర కోసం ఏర్పాట్లు చకచ కా సాగుతున్నాయి. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేయడంలో అధికారయంత్రాంగం నిమగ్నమైంది. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పనులు తుది దశకు చేరుకున్నాయి. భక్తులు వేచి ఉండేందుకు శాశ్వత షెడ్ను నిర్మిస్తున్నారు. దేవతల గద్దెలకు చుట్టూ సిమెంటు కాంక్రీటుతో ప్లాట్ఫాంలను వెడల్పుగా నిర్మిస్తున్నారు. స్నానాల కోసం షవర్ బాత్ నల్లాలను ఏర్పాటుచేశారు. మూడు ప్రాంతా ల్లో 45 మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు.
వాహనాల పార్కింగ్, దుకాణాల నిర్వహణ, భక్తులు సేదతీరేందుకు దాదాపు 50 ఎకరాల్లో భూమిని చదును చేయించారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా గౌతమేశ్వర ఆలయం వద్ద, గోదావరి నది ఇసుకలో ట్యాంకర్లను అందుబాటులో ఉంచనున్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మంచిర్యాల పట్టణంలోని ఓవర్బ్రిడ్జి నుంచి గోదావరి వరకు విస్తరించి ఉన్న కాలేజీరోడ్లో వీధిదీపాలు, గోదావరి నదిలో ఉన్న ఇసుకు కుప్పలను చదునుచేసి, చెత్తాచెదారాన్ని తొలగించి అక్కడ కూడా విద్యుద్దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేలా పారిశుధ్య కార్మికులను నియమిస్తున్నారు. అవసరమైన మేరకు నిత్యం బ్లీచింగ్ పౌడర్ను చల్లించాలని నిర్ణయించారు.
భక్తులు, ఇతర అవసరాలకు ఉపయోగపడేలా శాశ్వ త నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయించాం. ము ఖ్యంగా పారిశుధ్యం, తాగునీటి వసతి, విద్యుద్దీపా లు, స్నానఘట్టాలు, భక్తులకు వసతి ఏర్పాట్లపై ప్ర త్యేక దృష్టి సారించాం. మరుగుదొడ్లు, వేచి ఉండే గ దులు, ప్లాట్ఫాంలు, రోడ్లు, పైపులైన్లు, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనులు చేస్తున్నాం. త్వరలోనే పనులు పూర్తి కావస్తున్నాయి.
– ఉప్పలయ్య, మున్సిపల్ చైర్మన్, మంచిర్యాల