తాంసి, జనవరి 2 : తప్పులు లేకుండా దరఖాస్తులను పూరించి కౌంటర్లలో ఇవ్వాలని ఎంపీడీవో ఆకుల భూమయ్య అన్నారు. మంగళవారం మండలంలోని కప్పర్ల, గోట్కూరి గ్రామాల్లో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో దరఖాస్తులు స్వీకరించారు. బుధవారం జామిడి, పొన్నారి గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మి, ఎంపీవో సుధీర్ రెడ్డి, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు సదానందం, ఎంపీటీసీ భాగ్యలక్ష్మి, సంతోష్, నాయకులు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
డొంగర్గాం గ్రామ పంచాయతీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ ప్రవీణ్కుమార్ దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాథోడ్ రాంచందర్, ఉపసర్పంచ్ శేషనారాయణ, పంచాయతీ కార్యదర్శి రాథోడ్ హితేశ్, ఏఈవో మల్లేశ్, గ్రామపటేల్ పెందూర్ బాదు పాల్గొన్నారు.
ఉట్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఎంపీడీవో, పంచాయతీ ప్రత్యేకాధికారి తిరుమల దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
తలమడుగుతో పాటు సుంకిడి గ్రామంలో జడ్పీటీసీ గోక గణేశ్ రెడ్డి, ఎంపీడీవో రమాకాంత్ దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ మహావీర్, తహసీల్దార్ రాజ్మోహన్, ఎంఈవో నారాయణ, ఎంపీవో దిలీప్, సర్పంచ్లు మహేందర్, కరుణాకర్ రెడ్డి, ఎంపీటీసీ వెంకన్న, నాయకులు పాల్గొన్నారు.
అర్హులు దరఖాస్తు చేసుకోవాలి
ప్రభుత్వ పథకాలకు అర్హులైన వారు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో సుశీల్ రెడ్డి సూచించారు. మర్లపెల్లి ధన్నూర(బీ), కరత్వాడ గ్రామాల్లో న ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించారు. గ్రామస్తులు దరఖాస్తు చేసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుభాష్ చందర్, మండల పంచాయతీ అధికారి జీవన్ రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
బజార్హత్నూర్, భూతాయి(బీ) దేగామ గ్రామాల్లో తహసీల్దార్ శంకర్ ఆధ్వర్యంలో సర్పంచ్ల సమక్షంలో అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. బజార్హత్నూర్లోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురికి దరఖాస్తులు లభించక వెనుదిరిగి పోయారు. కార్యక్రమంలో ఎంపీవో మహేందర్రెడ్డి, ఎస్ఐ నరేశ్, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఉట్నూర్, లక్కారం, సాకేరా(బీ), ఏందా, మారుగూడ, జైత్రాంతండాలో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ఎంపీడీవో తిరుమల పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్లు, అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలి
ప్రజాపాలన సభకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని ఎంపీడీవోలు కావల రమేశ్, రామేశ్వర్ అధికారులకు సూచించారు. నార్నూర్, కొత్తపల్లి, తాడిహత్నూర్, గాదిగూడ మండలంలోని లోకారి(కే), పిప్రి, గాదిగూడ, పర్సువాడ(బీ) గ్రామాల్లో ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించి లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జాడి రాజాలింగం, ఎంపీవోలు సాయిప్రసాద్, రాథోడ్ గంగాధర్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలను బయట కొనవద్దని జిల్లా పంచాయతీ రాజ్ అధికారి పీ శ్రీనివాస్ ప్రజలకు సూచించారు. దరఖాస్తులు ఫారాలను పంచాయతీ కార్యదర్శుల వద్ద అందుబాటులో ఉంచామన్నారు. బహదూర్ పూర్ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో ప్రజాప్రతినిధులు వివిధ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన కౌంటర్లలో ప్రజలు దరఖాస్తులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎం రాధిక, ఉప సర్పంచ్ పోతారెడ్డి, ఎంపీడీవో గజానన్ రావ్, ఐకేపీ ఏపీఎం భగవాన్, సీసీ గంగారాం, ఏఈవో విశాల్ పాల్గొన్నారు.
భీంపూర్ మండలం కరంజిలో 550, నిపానిలో 490 దరఖాస్తులు వచ్చాయని ఎంపీడీవో శ్రీనివాస్, డీటీ హరీశ్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీవో వినోద్, ఆర్ఐలు అశోక్, శారద, హెచ్ఈవో జ్ఞానేశ్వర్, సూపర్వైజర్ గంగాధర్, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు స్వాతిక, కేమ ప్రమీల, నాయకులు పాల్గొన్నారు.