నిర్మల్ అర్బన్, జూలై 15: రాష్ట్ర ప్రభుత్వం మా ధ్యమిక విద్య బలోపేతానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నది. ప్రాథమిక విద్యను బలోపేతం చేసి ప్ర తి పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ఇప్పటికే ప్రవేశ పెట్టింది. ఇక ఇంటర్లో కొత్త విధానాన్ని అమలు చేయాలని గతేడాదే నిర్ణయించింది. ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులు ఇంగ్లిష్పై పట్టు సాధించేలా చర్యలు చేపడుతోంది. విద్యార్థులు ఉద్యోగావకాశా లు కూడా సులభంగా అందిపుచ్చుకునేందుకు, ఇంగ్లిష్పై మరింత పట్టు సాధించేందుకు ఇంటర్లో ఈ సబ్జెక్టుకు ప్రాక్టికల్స్ నిర్వహించాలని భావిస్తున్న ది. గతేడాది నుంచే ఈ విధానానికి ప్రయత్నాలు ప్రారంభించగా, ఈ ఏడాది నుంచి అమలు చేసేం దుకు చర్యలు చేపట్టింది.
ప్రాక్టికల్ విధానం ఇలా..
ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్ ఉండడం సహజమే. ఇక ఇంగ్లీష్ సబ్జెక్టు కు కూడా ప్రాక్టికల్ నిర్వహించేందుకు సిద్ధమవుతు న్నది. నాలుగు దశల్లో ఈ ప్రాక్టికల్స్ ఉండనున్నా యి. మొదటిది లర్నింగ్.. విద్యార్థులు ఇంగ్లిష్ను స్పష్టంగా చదవాలి. చదవడంతో పాటు ఎలాంటి తప్పులు ఉండరాదు. రెండోది మాట్లాడడం.. ఇంగ్లి ష్ సబ్జెక్టుల్లోని ఏదైన ఒక సామాజిక అంశంపై త ప్పులు లేకుండా మాట్లాడాలి. మూడోది రైటింగ్. సబ్జెక్టులోని కథనాన్ని తప్పులు లేకుండా చదవగలగాలి. తరగతి గదిలో విద్యార్థులందరి చేత మాట్లాడిస్తారు. అలాగే ప్రశ్నించే తత్వాన్ని విద్యార్థులకు నేర్పిస్తారు. ఇలా ఒక్కో దశకు ఐదు మార్కుల చొ ప్పున 20 మార్కులను కేటాయించనున్నారు.
ఇంగ్లిష్పై పట్టు సాధించేలా..
విద్యార్థులు కఠిన సబ్జెక్టులను నిర్లక్ష్యం చేస్తూ దాటవేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా కఠిన సబ్జెక్టులను నిర్లక్ష్యం చేయడంతో భవిష్యత్ పోటీ పరీక్షల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి విధానాన్ని ప్రభుత్వం ముందుగానే గుర్తించి కఠిన సబ్జెక్టుపై విద్యార్థులు మక్కువను పెంచుకునేందుకు చర్యలు చేపట్టింది. విద్యార్థులు సబ్జెక్టులపై ఇష్టం పెంచుకునేందుకు ఇలాంటి సులభమైన విధానానికి శ్రీకారం చుడుతోంది. భవిష్యత్లో విద్యార్థులు ఇబ్బందులకు గురి కాకుండా ఆంగ్లంపై పట్టు సా ధించేలా చూడనుంది.
4337 మంది విద్యార్థులు
నిర్మల్ జిల్లాలోని 19 మండలాల్లో ప్రభుత్వ, ప్రై వేటు కళాశాలలో దాదాపు 4 వేల మంది విద్యార్థు లు చదువుకుంటున్నారు. ఇందులో మొత్తం ప్రభు త్వ కళాశాలలు 12 ఉండగా, వీటిలో 1937 మంది విద్యార్థులు చదువుతున్నారు. 22 ప్రైవేటు కళాశాలల్లో 2400 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తంగా 4337 మంది విద్యార్థులు ఇంటర్ చదువుతున్నారు.
గైడ్లెన్స్ రాలేదు..
ఇంటర్ విద్యార్థులు ఇంగ్లిష్ భాషపై మరిం త పట్టు సాధించేలా ప్రాక్టికల్స్ నిర్వహించా లని ప్రభుత్వం భావిస్తు న్నట్లుగా తెలిసింది. ఇ ప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి గైడ్లెన్స్ రాలేదు. కానీ ఈ నిర్ణ యం భేష్. విద్యార్థులకు ఆంగ్లంపై పూర్తి స్థాయి ప ట్టు వస్తుంది. అంతే కాకుండా విద్యార్థులందరికీ ఇంగ్లిష్పై భయం పోయి ఆసక్తి పెరుగుతుంది. తోటి విద్యార్థులతో పోటీభావం పెరుగుతుంది. దీంతో ఉ ద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి.
-పరుశరాం, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి, నిర్మల్