నిర్మల్ టౌన్, ఏప్రిల్ 3 : తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజలను సంఘటితం చేసిన పోరా ట వీరుడు దొడ్డి కొమురయ్య అని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి మాట్లాడుతూ.. జనగామ జిల్లాలో జన్మించిన కొమురయ్య భూమి, భుక్తి, విముక్తి ఉద్యమంగా అనేక పోరాటాలు చేశాని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు రాంకిషన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, బీసీ సంక్షేమశాఖ అధికారి లోకేశ్, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్రెడ్డి, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ చిలుక రమణ, బీసీ సంక్షేమ సహాయ అధికారి గంగాధర్, అధికారులు సృజయ్, కలీం తదితరులు పాల్గొన్నారు.
అణగారిన జీవితాల్లో అక్షరజ్ఞానాన్ని ప్రసాదించిన సావిత్రిబాయిఫూలే కావ్య సంపుటిని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తన నివాసంలో వివరించారు. నిర్మల్కు చెందిన ప్రముఖ వైద్యుడు దామెర రాములు రచించిన ‘నేను సావిత్రిబాయి ఫూలేను మాట్లాడుతున్నాను’ అనే అంశంపై రచించడం ఎంతో అభినందనీయమని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు చక్రధరి, కృష్ణంరాజు, మురళీధర్, న్యాయవాది వినోద్రావు, కవులు పత్తిశివప్రసాద్, నేరెళ్ల హన్మంత్, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లోకేశ్వరం, ఏప్రిల్ 3 : రాజూరా గ్రామంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట వీరుడు, తొలి అమరుడు కొమురయ్య అని పేర్కొన్నారు. రాజురా గ్రామం ఐక్యతకు నిదర్శనమని, మండలంలో కొమురయ్య మొట్టమొదటి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం సంతోషకరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జయంతి, వర్ధంతిని అధికారికంగా జరుపాలని ప్రకటించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని స్పష్టం చేశారు. కుర్మ సంఘం జిల్లా అధ్యక్షుడు జట్ల రాజారాం మాట్లాడుతూ.. కొమురయ్య జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ సర్కారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముత్తా గౌడ్, ఎంపీటీసీ ఒరికే నర్సవ్వపోతన్న, ఎంపీపీ లలిత, భోజన్న, పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, సర్పంచులు సౌజన్యాకపిల్, బీ వెంకట్ రావు, రేఖాబాయి లక్ష్మణ్ పటేల్, రైతు బంధు సమితి అధ్యక్షుడు లింగన్న, సీనియర్ నాయకులు మెండే శ్రీధర్, లక్ష్మణ్ రావు, సోషల్ మీడియా అధ్యక్షులు బండి ప్రశాంత్, ఒరికే సాయినాథ్, దొడ్డి కొమురయ్య యూత్ అధ్యక్షుడు, కుర్మ కులస్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.