ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 8 : తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నలుదిశలా చాటి చెప్పిన నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆరోపణలు చేయడం సరికాదని టీఆర్ఎస్ పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు స్వరూప అన్నారు. ఇటీవల బీజేపీ నేతలు చేసిన ఆరోపణలను ఖండిస్తూ గురువారం ప్రెస్క్లబ్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
బీజేపీ నాయకుల వైఖరిపై మండిపడ్డారు. పట్టణంలో బీజేపీ నేతలు చేసిన ధర్నాలు సరికాదన్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు అత్యున్నత స్థాయిలో గౌరవం తీసుకొచ్చిన కల్వకుంట్ల కవితపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సదరు కేసు కు ఎలాంటి సంబంధం లేకపోయినా అనవసరంగా వ్యాఖ్యలు చేస్తున్నారని వాపోయారు. ఈ సమావేశంలో బొడ గం మమత తదితరులు పాల్గొన్నారు.