ఇంద్రవెల్లి, డిసెంబర్ 30 : వచ్చే నెల 21న మహాపూజలతో ప్రారంభం కానున్న నాగోబా జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చే యాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. మండలంలోని కెస్లాపూర్ నాగోబా దర్బార్ హాల్లో వివిధ శాఖలకు చెందిన జిల్లాస్థాయి అధికారులతో పాటు ఐటీడీఏ, పోలీస్, దేవాదాయ శాఖ అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. గత జాతరలో శాఖల వారీ గా చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు భక్తులు, మెస్రం వంశీయులకు కల్పించిన సౌకర్యాలు, ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు కల్పించే సౌకర్యాలతో పాటు జాతరలో చేపట్టే పనులతో పాటు ఏర్పాట్ల పనులను శాఖల వారీగా అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఆలయం తో పాటు ప్రతిష్ఠించిన నాగోబాను దర్శించుకోవడానికి ఈసారి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంటుందన్నారు. జనవరి 7 నుంచి ప నులు ప్రారంభించి 17 వరకు పూర్తి చేయాలని సూచించారు. ఏర్పాట్ల పనులపై నిర్లక్ష్యం చేస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జాతర ప్రారంభం నుంచి ముగిసే వరకు నిత్యం పారిశుధ్య పనులు చేపడుతూ శుభ్రతను పాటించాలన్నారు.
24 గంటల పాటు విద్యుత్ సరఫరా, తాగునీటికి ఇబ్బందుల్లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాల పార్కింగ్ స్థలంతో పాటు తైబజార్, ప్రభుత్వ శాఖలకు చెందిన అన్ని రకాల స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో పాటు వివిధ రకాల పూలతో అలంకారణ చేయాలని ఆదేశించారు. నాగోబా దర్శనానికి వచ్చే ప్ర ముఖలు, వీఐపీలు, ఇతర భక్తులతో పాటు మహిళలకు, పురుషులకు వేర్వేరుగా క్యూలైన్లను ఏర్పా టు చేయాలన్నారు. చుట్టు పక్క గ్రామాల్లో మ ద్యం లేకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. రద్ధీ ప్రాంతంతో పాటు ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. మెస్రం వంశీయు లు సూచించిన అన్ని సమస్యలను పరిష్కరించి, కెస్లాపూర్ నుంచి దుర్వగూడ ఎక్స్రోడ్డు వరకు మట్టి రోడ్డు ఏర్పాటు చేసి మెండపల్లి మట్టిరోడ్లకు మరమ్మతులు చేస్తామన్నారు. కార్యక్రమంలో శిక్షణ అదనపు కలెక్టర్ శ్రీజా, ఆర్డీవో సురేశ్ కదం, డీఆర్డీవో కిషన్, డీపీవో శ్రీనివాస్, ఏజెన్సీ అదనపు వైద్యాధికారి కుడిమేత మనోహర్, ఐటీడీఏ మేనేజర్ రాంబాబు, తహసీల్దార్ ముంజం సో ము, ఎంపీడీవో పుష్పలత, సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్, జడ్పీటీసీ ఆర్కా పుష్పలత, ఆలయ ఈవో రాజమౌళి, డీఈ శివకుమార్, డీఎల్పీవో భిక్షపతిగౌడ్, పీఆర్ డీఈ రమేశ్, సీఐ సైదారావ్, ఎస్ఐ సునీల్, మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్, మెస్రం వంశీయులు నాగ్నాథ్, తుకారాం, ఆనంద్రావ్ పాల్గొన్నారు.
ఉద్యానవన కేంద్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి
ఉట్నూర్ రూరల్, డిసెంబర్ 30: గిరి రైతుల ఉద్యానవన కేంద్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి సూచించారు. మండలకేంద్రంలోని ఉద్యానవన నర్సరీ, శిక్షణ కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా జామ మొక్కను నాటారు. అనంతరం వివిధ కూరగాయల పంటలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గిరిజన రైతులు లాభసాటి పంటలు సాగు చేసి అభివృద్ధి చెందేలా ఉద్యానవన కేంద్రం ద్వారా శిక్షణ అందించాలన్నారు. చిరుధాన్యాలు, కూరగాయల పంటల సాగులో ఆధునిక పద్ధతులు పాటించి అధిక లాభాలు అర్జించేలా వారిని ప్రోత్సహించాలని సూచించారు. నర్సరీలో నూతనంగా నాలుగు ఎకరాల్లో జామ మొక్కలు, రెండు ఎకరాల్లో టమాట, మిర్చి, బెండ, వంకాయ, వివిధ ఆకుకూరలను పండిస్తున్నామన్నారు. అలాగే డ్రాగన్ ప్రూట్, నర్సరీ చుట్టూ కాగితపు అవసరమైన కానుగ చెట్లను నాటాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఓఎస్డీ కృష్ణయ్య, ఉద్యానవన అధికారి సుధీర్, సిబ్బంది ఉన్నారు.
గిరి విద్యార్థులు ఉన్నత స్థానంలో నిలువాలి
గిరి విద్యార్థులు ఉన్నత స్థానంలో నిలవాలని ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి సూచించారు. శుక్రవారం తన చాంబర్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్టార్స్ 50 శిక్షణ కేంద్రం నుంచి ఐఐటీ, నీట్ విద్యాసంస్థలో సీట్లు సాధించిన విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఆదిలాబాద్ స్టార్స్ 50 కేంద్రం ద్వారా 2021 సంవత్సరంలో ఐదుగురు విద్యార్థులు ఐఐటీ, నీట్ వంటి విద్యాసంస్థలో సీట్లు సాధించారని అన్నారు. అందుకు ప్రోత్సహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అభినందించారు. ప్రతిభ గల విద్యార్థులకు ఐటీడీఏ ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో ఆర్సీవో గంగాధర్, అధ్యాపకులు, విద్యార్థులు సువర్ణ, ప్రవీణ్, లావణ్య పాల్గొన్నారు.
ప్రారంభం
ఇంద్రవెల్లి, డిసెంబర్ 30 : మండలంలోని కెస్లాపూర్ గ్రామంలో ఏర్పాటు ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి స్థానిక సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్, జిల్లా అధికారులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం వివిధ రకాల మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అన్ని రకాల ఆటల పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. మట్టి వేసి కంకరా లేకుండా భూమిను చదును చేయించాలని సూచించారు. చుట్టూ మొక్కలు నాటి ఆహ్లాదకారమైన వాతావరణాన్ని సృష్టించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో కిషన్, ఎంపీడీవో పుష్పలత, ఏపీవో జాదవ్ శ్రీనివాస్, టీఏలు మహేందర్, ప్రకాశ్, జీపీ కార్యదర్శి మహ్మద్ మోతేశ్యాం తదితరులు పాల్గొన్నారు.