ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించిన చైర్మన్ నరేందర్ రెడ్డి
నిర్మల్ అర్బన్, జూన్ 30: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉ త్తమ ప్రతిభ చూపారు. 139 మంది విద్యార్థులు 10/10 జీపీ ఏ మార్కులను సాదించారని పాఠశాల నిర్వాహకులు తెలిపా రు. పదో తరగతి ఫలితాల్లో మం చి మార్కులు సాధించిన విద్యార్థులను గురువారం కరీంనగర్ జిల్లా లో అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్రెడ్డి అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..141 మంది విద్యార్థులు 9.8 జీపీఏ, 100 మంది విద్యార్థులు 9.7 జీపీఏ మార్కులను కై వసం చేసుకున్నారని పేర్కొన్నా రు. కరోనాకు ముందు, తర్వాత అల్ఫోర్స్ విద్యాసంస్థలు సంచలన విజయాలను కొనసాగిస్తూ విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందిస్తున్నాయని తెలిపారు. ఇం దుకు ప్రోత్సాహాన్ని అందిస్తున్న తల్లిదండ్రులకు, సంస్థలోని ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదా లు తెలిపారు.