మంచిర్యాల ఏసీసీ, ఏప్రిల్ 14 : జిల్లా కేంద్రంలోని ఓ బార్ ఏరియాలో శనివారం అర్ధరాత్రి తాగుబోతులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో కొందరు యువకులు ఓ వ్యక్తిని చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. శనివారం రాత్రి కొందరు యువకులు స్థానిక బార్లో మద్యం తాగి.. ఆపై బార్ బయటకు వచ్చి గొడవ పడుతుండగా, ఓ వ్యక్తి వారికి గొడవ పడవద్దని సూచించాడు. దీంతో వారంతా అతడిపై దాడి చేసినట్లు తెలిసింది.
మందుబాబుల బారి నుంచి తప్పించుకునేందుకు అతడు పరుగులు తీస్తుండగా, వెంటపడి మరీ క్రికెట్ బ్యాట్, వికెట్లతో విచక్షణారహితంగా దాడి చేసి పారి పోయారు. తీవ్రంగా గాయపడ్డ సదరు వ్యక్తిని ప్రభుత్వ దవాఖానకు తరలించినట్లు సమాచారం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ విషయమై పట్టణ సీఐ బన్సీలాల్ను వివరణ కోరగా, శనివారం రాత్రి పదిన్నర సమయంలో రెండు వర్గాలు తాగిన మైకంలో గొడవ పడ్డాయని, ఇరువురికి గాయాలయ్యాయని, ఆదివారం ఇరువ ర్గాల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తు న్నామన్నారు.