దస్తురాబాద్,ఫిబ్రవరి8 : మహిళలకు రక్షణగా సఖీ కేంద్రం అండగా ఉంటుందని నిర్వాహకురాలు మమత అన్నారు. దస్తురాబాద్లోని కార్యాలయాల్లో మహిళలకు, కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సఖీ కేంద్రం సభ్యులు మంగళవారం అవగాహన కల్పించారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో కలిసి సఖీ కేంద్రం సభ్యులు పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణ ప్రభు త్వం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో వన్స్టాప్ సెంటర్గా సఖీ కేంద్రం పని చేస్తున్నదన్నారు. బాధితులకు నిరంతరం సేవలందించేందుకు సఖీ వన్స్టాప్ సెంటర్ను ప్రభుత్వం ప్రారంభించినట్లు చెప్పారు. బాధితులకు సఖీ కేంద్రం భరోసాగా ఉంటుందన్నారు. బాధితులు సఖీ కేంద్రానికి రాలేని పరిస్థితి ఉంటే వారికి వాహన సేవలు అందిస్తామన్నారు. ఆపదలో ఉన్న మహిళలు 181 టోల్ ఫ్రీ నంబర్కు లేదా నిర్మల్ సఖీ కేంద్రం నంబర్ 8500540181కు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది అశ్విని, సవిత, అకౌంటెంట్ నరేశ్, ఉపాధ్యాయులు, మహిళలు,విద్యార్థులు పాల్గొన్నారు.