కాసిపేట, మే 24 : తాటిగూడలోని భీమన్న దేవుడికి ఆదివాసీ గిరిజనులు శుక్రవారం ప్ర త్యేక పూజలు చేశారు. ఆరాధ్య దేవుడి ప్రతిమలను డోలు వాయిధ్యాల నడుమ కాలినడకన సల్పాలవాగు వద్దకు తీసుకెళ్లి గంగాజలాలతో శుద్ధి చేశారు. పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు.
తిరిగి స్వగ్రామానికి తీసుకొచ్చారు. అనంతరం ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ పటేల్ మడావి శేఖర్, పూజారి మడావి వెంకటేశ్, మడావి రాజు, మడావి గోపాల్, వెలాది అర్జు, సిడం కమలాకర్, సిడం శ్రీనివాస్ పాల్గొన్నారు.