ఎదులాపురం, జూలై 2 : మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ అక, షీ టీం సిబ్బందికి సూచించారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సరిల్ ఇన్స్పెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. జూన్లో షీ టీం 90 ఫిర్యాదులను పరిషరించగా, 87 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని 52 పెట్టి కేసులు, ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే ఒక బాల్య వివాహాన్ని అడ్డుకుని, 76 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు 48 గ్రామాలు, 157 హాట్ స్పాట్లలో ప్రత్యేక నిఘా చేపట్టినట్లు వెల్లడించారు.
ప్రతి వారం మూడు పాఠశాలలు, మూడు గ్రామాలను సందర్శించి మహిళల సమస్యలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహిళలు వేధింపులు ఎదురైతే వెంటనే డయల్-100, షీ టీం నంబర్ 8712659953కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమావేశంలో ప్రతిభ కనబరిచిన ఐదుగురు పోలీస్ అక, షీ టీం సిబ్బందిని ప్రశంసాపత్రాలతో సతరించారు.