ఎదులాపురం,డిసెంబర్ 2 : సంక్షేమం ఘన త సీఎం కేసీఆర్దేనని దమ్ముంటే బీజేపీ పాలిత ప్రాంతాల్లో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని వెజిటెబుల్ మార్కెట్ అసోసియేషన్ కు సంబంధించిన 240 మంది టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో శుక్రవారం చేరారు.
ముందుగా స్థానిక గాంధీచౌక్ నుంచి మార్కెట్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. బ్యాండ్ మేళాల మధ్య ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. శివాజీచౌక్లోని కూరగాయల మార్కెట్లో ఏర్పా టు చేసిన స్థలం వరకు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేకు గజమాలతో ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుడుతో పాటు పలువురికి టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ దేశంలోని 28 రాష్ట్రంల్లో అమలు కాని సంక్షేమ పథకాలు కేవలం తెలంగాణలోనే అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేన్నారు. రైతు బాగుంటే దేశం బాగుంటుంది.
మోదీ పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అమలు సంక్షేమ పథకాలు, అభి వృద్ధిని చూసే టీఆర్ఎస్లో భారీగా చేరుతున్నార ని పేర్కొన్నారు. కేంద్రం ప్రభుత్వం కేవలం దేశంలో 12 మందికి అనుకూలంగానే పాలన కొనసాగిస్తున్నదని మండిపడ్డారు. రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న కేంద్రం ప్రభ్తుత్వం ఆ హామీని తుంగలో తొక్కిందని ఆరోపించారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, టీఆర్ఎస్(బీఆర్ఎస్) పట్టణ అధ్యక్షుడు అలలా అజయ్, నాయకులు సాజీద్ ఉద్దీన్, వెజిటెబుల్ కమిషన్ ఏజెంట్ (రైతు యూనియన్) అధ్యక్షుడు సయ్యద్ అజార్ అలీ, ఉపాధక్ష్యడు రాఫిక్(తేజ), స్వరుప, మమత, కస్తాల ప్రేమల తదితరులు ఉన్నారు.
జిల్లా కేంద్రంలో ఎన్నో ఏళ్లుగా మూతపడి ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీ ఆఫ్ ఇండియా(సీసీఐ)ను తెరిపించాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పలు మార్లు కేంద్రానికి లేఖ రాసినా కేంద్రం స్పందిం చలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే సీసీఐని నడిపిం చేందుకు సిద్ధంగా ఉందన్నారు.