ఆదిలాబాద్ టౌన్, జనవరి 20 : ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం నేర్పించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లాకేంద్రంలోని గెజిటెడ్ నంబర్.1 ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లాస్థాయి బోధనోపకరణల మేళా కార్యక్రమాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధనాంశాలు వివరించాలన్నారు. పఠనాశక్తిని పెంపొందించేలా పటా ల ద్వారా వివరించాలన్నారు. మండల స్థాయి ల్లో జరిగిన మేళాలో ఎంపిక చేయబడిన వాటిని జిల్లాస్థాయిలో తెలుగు, ఉర్దూ నుంచి 400 ఎగ్జిబిట్లను ప్రదర్శించినట్లు తెలిపారు.
ఈ విద్య సంవత్సరంలో ఎఫ్ఎల్ఎన్, టీఎల్ఎన్ కార్యక్రమాలపై ప్రత్యేక ఫోకస్ కనబరిచి విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించినట్లు చెప్పారు. రాష్ట్రస్థాయిలోనూ ఇదేస్థాయిలో ప్రతిభ కనబరచాలని, అందుకు ఉపాధ్యాయ వర్గం కృషి చేయాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు తొలిమెట్టు కార్యక్రమం కింద అర్థవంతమైన తరగతులు నిర్వహించాలన్నారు. జిల్లాలో 18 మండలాల పరిధిలోని సుమారు 400 మంది విద్యార్థులు ప్రదర్శనలు ఇస్తున్నారని తెలిపారు. పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు కల్పించేందుకు ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద రూ.కోట్లు ఖర్చు చేసి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేస్తున్నామని చెప్పారు. అనంతరం విద్యార్థులు నృత్యం చేశారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లను తిలకించారు. ఈ కార్యక్రమంలో డీఈవో ప్రణీత, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, కౌన్సిలర్లు శ్రీనివాస్, సతీశ్, అశోక్ స్వా మి, మండల విద్యాధికారి జయశీల, సెక్టోరల్ అధికారులు నర్సయ్య, నారాయణ పాల్గొన్నారు.
ఎదులాపురం, జనవరి 20 : గిరిజన కొలాం, తోటి కులస్తుల స్థితిగతులను అధ్యయనం చేయడానికి, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలను పరిశీలించేందుకు కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ బృందం జిల్లాలో పర్యటించినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. కలెక్టరేట్లో బృందం సభ్యులు గిరిజన మంత్రిత్వ శాఖ కొలాం కమ్యూనిటీ అండర్ సెక్రటరీ కే చంద్రశేఖర్, అస్సాం టైపెడ్ తోటి కమ్యూనిటీ డిప్యూటీ మేనేజర్ పామ్ థింగ్ క్రిషింగ్, గిరిజన సంక్షేమ శాఖ టీఆర్ఐ జాయింట్ డైరెక్టర్ సముజ్వల, అసిస్టెంట్ మ్యూజియం క్యూరేటర్ శైలజ కలిసి పర్యటన వివరాలను కలెక్టర్కు వివరించారు. జిల్లాలోని రామడుగు, ధర్మాజీపేట, కామాయిపేట కొలాం గ్రామాలు, పూనగూడ, వాఘపూర్, దివ్యగూడ గ్రామాలను సందర్శించినట్లు కలెక్టర్కు బృందం సభ్యులు వివరించారు. వారి వెంట ఐటీడీఏ పరిపాలనాధికారి రాంబాబు, ఏపీవో భాస్కర్ ఉన్నారు.