‘ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో రూ.40 కోట్లతో ఐటీ టవర్ ఏర్పాటు చేసి, 800 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. ‘సబ్కా సాథ్.. సబ్కా వికాస్’ పేరిట దేశ ప్రజలను మోదీ మోసం చేస్తున్నారు’ అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 500 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు చేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. అంతకముందు జిల్లాకేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఎదులాపురం, జనవరి 29 : త్వరలోనే జిల్లా కేంద్రంలో రూ.40 కోట్లతో ఐటీ టవర్ ఏర్పాటు చేసి 800 మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశాలు ఉన్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గణేశ్ నాయుడు, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి సతీశ్ యాదవ్తో పాటు సుమారు 500 మంది యువకులు ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. ముందుగా గణేశ్ నాయుడు, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సతీశ్ యాదవ్కు, ముఖ్య నాయకుడు శ్రీనుకు ఎమ్మెల్యే జోగు రామన్న బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రవీంద్రనగర్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీ వినాయక్ చౌక్ నుంచి బయలుదేరి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. ‘సబ్కా సాత్.. సబ్కా వికాస్’ పేరిట దేశ ప్రజలు, యువకులను ప్రధానమంత్రి మోదీ మోసం చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం కేవలం అంబానీ, లలిత్ మోదీ, తదితరులకు కొమ్ముకాస్తూ పాలన కొనసాగిస్తున్నదన్నారు. దేశ ప్రజలు, యువకులకు బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువత కోసం ఐటీ కంపెనీ ఏర్పాటు చేసి 130 మంది ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న వారికి వచ్చే సంవత్సరం జీతాలు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
టెక్స్టైల్స్ పార్క్ను ఏర్పాటు చేసి అం దులో సైతం ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. దేశాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీతో దశ దిశ మార్చనున్నారని తెలిపారు. దేశ భవిష్యత్ యువతుల చేతుల్లోనే ఉందన్నారు. బీఆర్ఎస్పై నమ్మకంతో చేరిన యువకులకు 24 గంటలు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, పట్టణాధ్యక్షుడు అలాల అజయ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, బీఆర్ఎస్ నాయకులు తూర్పుటి భూమన్న, రామ్ కుమార్, దాసరి రమే శ్, మిట్టపూరి యోగేశ్, సాజిత్ ఉద్దీన్, కోఆప్షన్ సభ్యుడు ఎజాజ్, బీఆర్ఎస్ యువనాయకుడు జోగు మహేందర్, ఆత్మ కమిటీ చైర్మన్ జిట్ట రమేశ్, పట్టణ మహిళా విభాగం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు స్వరూప, మమత, మైనార్టీ విభాగం అధ్యక్షుడు సలీం పాషా పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం-2023 డైరీ, క్యాలెండర్ను ఎమ్మెల్యే జోగు రామన్న ఆయన నివాసంలో సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ అడిషనల్ జనరల్ సెక్రటరీ పూదరి గోపాల్రావు, ఆదిలాబాద్ డివిజన్ అధ్యక్షుడు సంతోష్, కార్యదర్శి సాంబయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ దేవదాసు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ విలయతాండవం చేసినా తమ ప్రాణాలు లెక్క చేయకుండా ల్యాబ్ టెక్నీషియన్లు చేసిన సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ సంఘ భవనం లో తెలంగాణ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఆత్మీయ సమ్మేళన సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందు గా జ్యోతి ప్రజ్వలన చేసి టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షప్రధాన కా ర్యదర్శులు సంద అశోక్, ఎడ్ల నవీన్ కుమార్, ల్యాబ్ టెక్నీషియన్ల సంఘం నాయకులతో కలిసి ఎమ్మెల్యే క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఏవైనా చికిత్సలు చేయాలంటే ముందు ల్యాబ్ రిపోర్టు లేనిది ఏదీ సాధ్యం కాదన్నారు.
త్వరలోనే ల్యాబ్ టెక్నీషియన్ల ముఖ్యమైన సమస్యలు, ప్రమోషన్లు తదితర అంశాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని భరోసానిచ్చారు. అనంతరం ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ జిల్లా అధ్యక్షప్రధాన కార్యదర్శులు కన్నం శ్రీనివాస్, కలీం అన్సారీ, కోశాధికారి వొజ్జల సంతోషిణి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ సమీ తదితరులు పాల్గొన్నారు.