ఎదులాపురం, ఫిబ్రవరి 21 : తెలంగాణ ఏర్పాటు తర్వాత అనతికాలంలోనే ఏండ్లనాటి సమస్యలకు పరిష్కారం చూపగలిగామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులుపడ్డ పట్టణ ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. జిల్లా కేద్రంలోని షాద్నగర్లో రూ.15లక్షలు, పిట్టలవాడలో రూ.15లక్షలతో రహదారి, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలు అనవసర విమర్శలు చేయకుండా అభివృద్ధిపై సలహాలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీసీఐపై స్పందించకుండా కాలయపన చేస్తున్నదని విమర్శించారు. కేంద్రం పరిధిలోని సమస్యలపై చర్చించకుండా రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, కౌన్సిలర్లు ఆర్చన రామ్కుమార్, సంగీత ధమ్మపాల్, బండారి సతీశ్, అశోక్ స్వామి, సంద నర్సింగ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దివీటి రాజు, మిట్టపురే యోగేశ్, దాసరి రమేశ్, సంజీవ్ గౌడ్, శ్రీనివాస్, నరేశ్, దత్తు, గంగారం, శంకర్, మహిళా నాయకులు స్వరూప రాణి ఉన్నారు.
ఆదిలాబాద్ టౌన్, ఫిబ్రవరి 21 : ‘మన బస్తీ-మన బడి’ కింద ఖుర్షిద్నగర్లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత ఉర్దూ మీడియం పాఠశాలలో అభివృద్ధి పనులు పూర్తవగా, తరగతి గదులను కలెక్టర్ రాహుల్రాజ్ ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. గతంలోని ప్రభుత్వ పాఠశాలలకు ప్రస్తుత పాఠశాలలకు వ్యత్యాసం పరిశీలించి తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రు లు ముందుకు రావాలని సూచించారు. ప్రభు త్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రైవేట్కు దీటుగా ఫలితాలు సాధించాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ని యోజకవర్గంలోని 77 ప్రభుత్వ పాఠశాలల్లో రూ. 19.90 కోట్లతో అభివృద్ధి పనులు చే పట్టినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన చేపట్టి ఉజ్వల భవిష్యత్ పొందాలని ఆకాంక్షించారు. కౌన్సిలర్ సలీం, డీఈవో ప్రణీత, మున్సిపల్ కమిషనర్ శైలజ పాల్గొన్నారు.