ఎదులాపురం, డిసెంబర్ 9 : జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించిన కేసుల్లో కక్షిదారుల ఇద్దరిదీ గెలుపవుతుందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్ఎస్ఏ చూర్పర్సన్ మంత్రి రామకృష్ణ సునీత అన్నారు. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చాంబర్లో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 11వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించి, తెలియజేశామని తెలిపారు. కోర్టు చుట్టూ కక్షిదారులు తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దనే ఉద్దేశంతో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో వివిధ కేసులు త్వరితిగతిన పరిష్కరించేందుకు లోక్ అదాలత్ను మంచి వేదికగా చేసుకోవాలని తెలిపారు. అన్ని సివిల్, బ్యాంక్, ఫ్యామిలీ కేసులు తదితర వాటిని పరిష్కరించనున్నట్లు తెలిపారు. రెండుమూడేళ్ల నుంచి కేసులు పరిష్కరించడంలో మొదటి స్థానంలో నిలిచామని గుర్తుచేశారు. అలాగే ఈ యేడాదిలో నిర్వహించిన లోక్ అదాలత్లో పీఎల్సీ కేసులు 6,179, వివిధ పెండింగ్ కేసులు 19,758 పరిష్కరించినట్లు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 37 వేల కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. అనంతరం లోక్ఆదాలత్కు సంబంధించిన వాల్పోస్టర్లను విడుదల చేశారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు వై జయప్రసాద్, క్షమాదేశ్ పాండే, జీ ఉదయ్భాస్కరావు, ఎస్ మంజుల పాల్గొన్నారు.