నిర్మల్ టౌన్, అక్టోబర్ 4 : జిల్లాల్లో కొత్తగా సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనాలను పూర్తి చేస్తూ ప్రజల ముంగిట్లో పాలన ఉండేలా సర్కారు చర్యలు చేపడుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావర ణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్లోని ఎల్లపెల్లి గ్రామ శివారులో నూతనంగా చేపట్టిన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను మంగళవారం రోడ్లు, భవనాల శాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి శ్రీని వాస్, ఈసీ గణపతిరెడ్డితో కలిసి మంత్రి పరిశీలిం చారు. ఇప్పటి వరకు చేపట్టిన పనులు, పూర్తయిన పనులు, సుందరీకరణ, అప్రోచ్రోడ్డు, గార్డెన్, హెలీప్యాడ్ తదితర పనులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. పనుల న్నీ నెలరోజుల్లోగా పూర్తి చేసి భవనాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచా లని కాంట్రాకర్లను ఆదేశించారు. కలెక్టర్ ముషార ఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మాజీ ఎఫ్ఏసీఎస్ చైర్మన్ రాంకిషన్రెడ్డి, టీఆర్ ఎస్ యువ నాయకుడు అల్లోల గౌతంరెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, ఆర్అండ్బీ ఈఈ అశోక్, తదితరు లు పాల్గొన్నారు.
అమ్మవారి కీర్తి ప్రతిష్టలు మరింత పెంచాలనే ఉద్దేశ్యంలో సుమా రు రూ. 5 కోట్ల నిధులతో బంగల్పేట్ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని నిర్మించామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలో ని బంగల్పేట్ అమ్మ వారి ఆలయాన్ని మంత్రి సంద ర్శించారు. దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ నవంబర్ 15 తర్వాత ఆలయాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అనం తరం ఐదు పోచమ్మల ఆలయాన్ని మంత్రి సంద ర్శించి మొక్కులు తీర్చుకున్నారు. మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, యువ నాయకులు అల్లోల గౌతం రెడ్డి, కౌన్సిలర్లు బిట్లింగ్ నవీన్, గండ్రత్ రమణ, నరేందర్, నాయకులు గోవర్ధన్, ఆమెడ కిషన్, కాంట్రాక్టర్ లక్కాడి జగన్మోహన్ రెడ్డి తదితరు లున్నారు. కాగా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీయూటీఎఫ్ ఉపా ధ్యాయ సంఘం ఆధ్వర్యంలో క్యాంపు కార్యాల యంలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మురళీ మనోహర్ రెడ్డి, సంఘ సభ్యులు రవి కుమార్, తోట గంగాధర్, పరమేశ్వర్ రెడ్డి, ధర్మరాజ్, వహీద్ ఖాన్, శ్రీనివాస్, మతిన్, సునీల్ రెడ్డి, పాండురంగాచారి, శివ ప్రసాద్, వినోద్రాజ్, ముత్తన్న, రఘువీర పాణి తదితరులు పాల్గొన్నారు.