ఉట్నూర్, అక్టోబర్ 2 : మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి అన్నారు. ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయలో ఆదివారం గాంధీజీ జయంతి వేడుకలు నిర్వహించారు. పీవో, అధికారులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించుకున్నామన్నారు. సత్యం, ధర్మం, న్యాయం, నిజాయితీగా విలువలతో జీవించాలని, వ్యక్తిగత జీవితంలో అధికారిక విధులలో గాంధీజీ సూత్రాలు పాటించాలని సూచించారు. శాంతి, అహింస ద్వారానే స్వాతంత్య్రం సాధించుకున్నామని తెలిపారు. గాంధీజీ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ ఈఈ రాథోడ్ భీంరావ్, పీవీటీజీ భాస్కర్, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్, సిబ్బంది పాల్గొన్నారు.
బేల, అక్టోబర్ 2 : మండల కేంద్రంతో పాటు గ్రామాల్లోని పంచాయతీ, ప్రభుత్వ కార్యాలయాల్లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్లు ఇంద్రశేఖర్, విపిన్ ఖోడే, తుకారాం, అంబుతాయి, రాకేశ్, శంకర్, ఠాక్రే బేబితాయి, బాది ఉప సర్పంచ్ వినోద్, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్, అక్టోబర్ 2 : దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకురావడంలో కృషి చేసిన మహనీయుడు గాంధీజీ అని ఎంపీపీ పంద్ర జైవంత్రావ్ కొనియాడారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో ప్రాంగణంలో గాంధీజీ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీడీవో తిరుమల, ఈవో శంకర్, లక్కారం ఉప సర్పంచ్ సత్యం, నాయకులు సీతారాం, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, అక్టోబర్ 2 : మండలంలోని గిన్నేరా గ్రామ పంచాయతీ పరిధిలోని మర్కాగూడలో ఆదివాసీ గిరిజనుల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి నిర్వహించారు. సర్పంచ్ పూలబాయి, ఆదివాసీ గిరిజన నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన నాయకులు ఆర్కా ఖమ్ము, కుమ్ర కేశవ్రావ్, సోనేరావ్, మడావి ఆశారావ్ పాల్గొన్నారు. అలాగే మండల కేంద్రంలోని తహసీల్, మండల పరిషత్, పీఏసీఎస్, ఏఎంసీ, గ్రామ పంచాయతీ కార్యాలయాలతో పాటు కేస్లాపూర్, హీరాపూర్, గౌరాపూర్, హర్కాపూర్, ఏమాయికుంట, ముత్నూర్, గిన్నేరా, వడగాం, ఈశ్వర్నగర్లో గాంధీ జయంతి నిర్వహించారు. మండల అధికారులు, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ పోటే శోభాబాయి, జడ్పీటీసీ పుష్పలత, పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్డోంగ్రే, జాదవ్ శ్రీరాంనాయక్, తహసీల్దార్ సోము, ఎంపీడీవో పుష్పలత, తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, అక్టోబర్ 2: ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదివాసీ ప్రధాన్ పురోహిత్ సమాజ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. బస్టాండ్ ఆవరణలో మండల ప్రజాప్రతినిధులు గాంధీ విగ్రహానికి ఫూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్డోంగ్రే, వైస్ ఎంపీపీ పడ్వాల్ గోపాల్సింగ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, ఎంపీటీసీ ఆశాబాయి, ఆదివాసీ ప్రధాన్ పురోహిత్ సమాజ్ పటేల్ జ్ఞానేశ్వర్, ఆదివాసీ ప్రధాన్ పురోహిత్ సమాజ్ మండలాధ్యక్షుడు సోయం రాందాస్, మరప రాజు, భరత్, దీపక్సింగ్, శివాజీ, నాయకులు పాల్గొన్నారు.
నార్నూర్, అక్టోబర్ 2 : నార్నూర్, గాదిగూడ మండలాల్లోని పంచాయతీ, ప్రభుత్వ కార్యాలయాల్లో మహాత్మాగాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
నేరడిగొండ, అక్టోబర్ 2: యువత మహనీయుని అడుగజాడల్లో నడవాలని జడ్పీటీసీ జాదవ్ అనిల్ అన్నారు. గాంధీ జయంతి పురస్కరించుకొని మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే కుమారి, వాంకిడి, కొర్టికల్, వడూర్, తేజాపూర్, యాపల్గూడ, లఖంపూర్, తర్నం, వాగ్దారి, వెంకటాపూర్, రాజురా, ఈస్పూర్, లింగట్ల గ్రామాల్లో గాంధీజీ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, ఏఎంసీ చైర్మన్ దావుల భోజన్న, వీడీసీ చైర్మన్ ఎలేటి రవీందర్రెడ్డి, వైస్ ఎంపీపీ మహేందర్రెడ్డి, నేరడిగొండ, కుమారి పీఏసీఎస్ చైర్మన్లు సాబ్లే కిశోర్సింగ్, మందుల రమేశ్, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బోథ్, అక్టోబర్ 2 : బోథ్, సొనాల, కౌఠ(బీ), ధన్నూర్(బీ), కరత్వాడ, కన్గుట్ట, కుచులాపూర్ గ్రామాల్లో సర్పంచ్లు, నాయకులు గాంధీ విగ్రహానికి, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బోథ్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్లు సురేందర్యాదవ్, సదానందం, కొంకటి రాధిక, సింధు, శ్యామల, గంగాధర్, వార్డు సభ్యులు, రాజకీయ పార్టీల నాయకులు, సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
ఇచ్చోడ మండలంలో..
ఇచ్చోడ, అక్టోబర్ 2 : మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ముక్రా(కే), ఇచ్చోడలో గ్రామస్తులు రోడ్లను ఊడ్చి పరిసరాలు శుభ్రం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు చౌహాన్ సునీత, గాడ్గె మీనాక్షి, ఉపసర్పంచ్ లోక శిరీష్ రెడ్డి, వర్షతాయి, ఎంపీటీసీ సుభాష్, నిమ్మల శివకుమార్ రెడ్డి, ఎస్బీఎం జిల్లా కో ఆర్డినేటర్ జాదవ్ సంపత్, అధికారులు, అంగన్వాడీ టీచర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
భీంపూర్, అక్టోబర్ 2 : భీంపూర్, అందర్బంద్, కరంజి(టీ), కామట్వాడ, వడూర్, అర్లి(టీ) గ్రామాల్లో మహాత్మా గాంధీ జయంతి నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, టీఆర్ఎస్ మండల కన్వీనర్ నాగయ్య, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అనిల్, సర్పంచ్లు మడావి లింబాజీ, పెండెపు కృష్ణయాదవ్, స్వాతిక, బక్కి లలిత, లావణ్య , ఉపసర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.