నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 28 : నిర్మల్ జిల్లా ఏర్పాటుతో కార్పొరేట్ స్థాయిలో జిల్లాలో వైద్య సేవలు అందుతున్నాయని రాష్ట్ర అటవీ, పర్యా వరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో డాక్టర్స్లేన్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీవిద్య దవాఖానను బుధవారం ఆయన ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు అత్యుత్తమ వైద్యసేవలను అందించాల ని సూచించారు. గతంలో కార్పొరేట్ స్థాయి వైద్యం కోసం హైదరాబాద్కు వెళ్లాల్సి వచ్చేదని పేర్కొన్నారు. మంత్రిని దవాఖాన యాజమాన్యం సత్కరించింది. జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, పాకాల రాంచందర్, మాజీ సర్పంచ్ విలాస్, వైద్యులు విద్యుల్ల్లత, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
ముదిరాజ్ల సంక్షేమానికి కృషి చేస్తా
ముదిరాజ్ల సంక్షేమానికి కృషి చేస్తానని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. సారంగాపూర్ మండలానికి చెందిన ముదిరాజ్ సంఘ సభ్యులు మంత్రిని క్యాంపు కార్యాలయం లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భం గా సంఘం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించా రు. సంఘ భవనానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపీపీ అట్ల మైపాల్ రెడ్డి, అడెల్లి ఆలయ చైర్మన్ చందు, టీఆర్ఎస్ పార్టీ మండల ఇన్చార్జి అల్లోల మురళీధర్రెడ్డి, మండ ల కన్వీనర్ కొత్తపల్లి మాధవ రావు, నాయకులు రాజ్ మహ్మద్, శ్రీనివాస్ రెడ్డి, దినేశ్, భోజన్న, భూమన్న, లక్ష్మణ్, పతాని భూమేశ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
సోన్, సెప్టెంబర్ 28 : మండలంలోని కడ్తాల్, సోన్ గ్రామాలకు చెందిన బాధితులకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి నిర్మల్లోని తన నివాసం లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. గడ్ చాంద ముత్తవ్వకు మంజూరైన రూ. 22,500, కొత్తగొల్ల లతకు రూ. 30వేల విలువైన చెక్కులను అందజేశారు. పీఏసీఎస్ చైర్మన్ కృష్ణ ప్రసాద్రెడ్డి, సోన్ టీఆర్ఎస్ మండల కన్వీనర్ మోహినొద్దీన్, సర్పంచ్ టీ వినోద్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మహేందర్రెడ్డి, పీఏసీ ఎస్ డైరెక్టర్ దాసు, పుట్టి సాయిరాం, మద్దెల ప్రసాద్, సొన్న రవి, గడ్చాంద అనిల్ పాల్గొన్నారు.